ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- November 18, 2025
న్యూ ఢిల్లీ: మళ్లీ ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి.కొందరు అజ్ఞాత దుండగులు విద్యాసంస్థలు, కోర్టులను లక్ష్యంగా చేసుకొని బెదిరింపుల సందేశాలను పంపారు. పాటియాలా హౌస్, సాకేత్ కోర్టు, రెండు సీఆర్పీఎఫ్ స్కూల్స్కి కూడా బెదిరింపులు అందినట్లు సమాచారం.గుర్తు తెలియని వ్యక్తులు ఈ బెదిరింపులను మెయిల్ ద్వారా పంపినట్లు వెల్లడమయ్యింది. అధికారులు వెంటనే అప్రమత్తమై స్థలాల్లో తనిఖీలు నిర్వహించారు. తప్పుడు హెచ్చరికగా ఉన్నందున ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని తెలుసుకొని పరిస్థితి సడలింది.
ఇంతలో, ఇటీవల ఎర్రకోట వద్ద సంభవించిన బాంబు పేలుడు గుర్తుకు తెచ్చుకుంటోంది, ఇందులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా బెదిరింపులు అధికారులను మరియు ప్రజలను ఆందోళనలో పడేస్తున్నాయి. అయినప్పటికీ, ఢిల్లీలో బాంబు బెదిరింపులు కొత్తగా వచ్చిన విషయం కాదు. గతంలో కూడా పలు స్కూల్లు, విమానాలు, ఇతర కేంద్రాల పై గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







