ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- November 18, 2025
న్యూ ఢిల్లీ: మళ్లీ ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి.కొందరు అజ్ఞాత దుండగులు విద్యాసంస్థలు, కోర్టులను లక్ష్యంగా చేసుకొని బెదిరింపుల సందేశాలను పంపారు. పాటియాలా హౌస్, సాకేత్ కోర్టు, రెండు సీఆర్పీఎఫ్ స్కూల్స్కి కూడా బెదిరింపులు అందినట్లు సమాచారం.గుర్తు తెలియని వ్యక్తులు ఈ బెదిరింపులను మెయిల్ ద్వారా పంపినట్లు వెల్లడమయ్యింది. అధికారులు వెంటనే అప్రమత్తమై స్థలాల్లో తనిఖీలు నిర్వహించారు. తప్పుడు హెచ్చరికగా ఉన్నందున ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని తెలుసుకొని పరిస్థితి సడలింది.
ఇంతలో, ఇటీవల ఎర్రకోట వద్ద సంభవించిన బాంబు పేలుడు గుర్తుకు తెచ్చుకుంటోంది, ఇందులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా బెదిరింపులు అధికారులను మరియు ప్రజలను ఆందోళనలో పడేస్తున్నాయి. అయినప్పటికీ, ఢిల్లీలో బాంబు బెదిరింపులు కొత్తగా వచ్చిన విషయం కాదు. గతంలో కూడా పలు స్కూల్లు, విమానాలు, ఇతర కేంద్రాల పై గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







