ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- November 18, 2025
న్యూ ఢిల్లీ: మళ్లీ ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి.కొందరు అజ్ఞాత దుండగులు విద్యాసంస్థలు, కోర్టులను లక్ష్యంగా చేసుకొని బెదిరింపుల సందేశాలను పంపారు. పాటియాలా హౌస్, సాకేత్ కోర్టు, రెండు సీఆర్పీఎఫ్ స్కూల్స్కి కూడా బెదిరింపులు అందినట్లు సమాచారం.గుర్తు తెలియని వ్యక్తులు ఈ బెదిరింపులను మెయిల్ ద్వారా పంపినట్లు వెల్లడమయ్యింది. అధికారులు వెంటనే అప్రమత్తమై స్థలాల్లో తనిఖీలు నిర్వహించారు. తప్పుడు హెచ్చరికగా ఉన్నందున ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని తెలుసుకొని పరిస్థితి సడలింది.
ఇంతలో, ఇటీవల ఎర్రకోట వద్ద సంభవించిన బాంబు పేలుడు గుర్తుకు తెచ్చుకుంటోంది, ఇందులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా బెదిరింపులు అధికారులను మరియు ప్రజలను ఆందోళనలో పడేస్తున్నాయి. అయినప్పటికీ, ఢిల్లీలో బాంబు బెదిరింపులు కొత్తగా వచ్చిన విషయం కాదు. గతంలో కూడా పలు స్కూల్లు, విమానాలు, ఇతర కేంద్రాల పై గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







