రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- November 18, 2025
దుబాయ్: యూఏఈలో రెండు సంవత్సరాల క్రితం 39 ఏళ్ల భారతీయుడు రాకేష్ కుమార్ జాంగిద్ తప్పిపోయాడు. అతడి ఆచూకీని కనుగొనడంలో సహాయపడే ఏదైనా సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డును దుబాయ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ ప్రకటించారు.
రాకేష్ కుమార్ ఆచూకీని తెలియజేయాలని అతడి కుటుంబం వీడియోను చూసిన తర్వాత వారికి సాయం చేయాలని భావించినట్టు పాంథియోన్ డెవలపర్స్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ కల్పేష్ కినారివాలా తెలిపారు. తాను 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన తండ్రిని కోల్పోయానని కినారివాలా ఎమోషనల్ అయ్యాడు. రాకేష్ దూరమవ్వడం వారి కుటుంబం ఎదుర్కొంటున్న బాధ ఏమిటో తనకు తెలుసన్నారు. అందుకే రాకేష్ ఆచూకీని గుర్తించడంలో సాయం చేసే వారికి రివార్డు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
దుబాయ్లోని భారత కాన్సులేట్ జనరల్ తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు కినారివాలా చెప్పారు. రివార్డ్ ప్రకటన ద్వారా అందిన ఏదైనా విశ్వసనీయమైన ఆధారాన్ని కేసును నిర్వహించే అధికారులకు అందజేయబడుతుందని ఆయన అన్నారు.
భారత్ లోని రాజస్థాన్కు చెందని రాకేష్, ఉద్యోగం కోసం 2023 జూన్ 21వ తేదిన 60 రోజుల యూఏఈ టూరిస్ట్ వీసాపై దుబాయ్ వచ్చాడు. రెండు వారాల తర్వాత అతను కనిపించకుండా పోయాడు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







