ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం

- November 18, 2025 , by Maagulf
ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం

న్యూ ఢిల్లీ: మళ్లీ ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి.కొందరు అజ్ఞాత దుండగులు విద్యాసంస్థలు, కోర్టులను లక్ష్యంగా చేసుకొని బెదిరింపుల సందేశాలను పంపారు. పాటియాలా హౌస్, సాకేత్ కోర్టు, రెండు సీఆర్పీఎఫ్ స్కూల్స్‌కి కూడా బెదిరింపులు అందినట్లు సమాచారం.గుర్తు తెలియని వ్యక్తులు ఈ బెదిరింపులను మెయిల్ ద్వారా పంపినట్లు వెల్లడమయ్యింది. అధికారులు వెంటనే అప్రమత్తమై స్థలాల్లో తనిఖీలు నిర్వహించారు. తప్పుడు హెచ్చరికగా ఉన్నందున ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని తెలుసుకొని పరిస్థితి సడలింది.

ఇంతలో, ఇటీవల ఎర్రకోట వద్ద సంభవించిన బాంబు పేలుడు గుర్తుకు తెచ్చుకుంటోంది, ఇందులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా బెదిరింపులు అధికారులను మరియు ప్రజలను ఆందోళనలో పడేస్తున్నాయి. అయినప్పటికీ, ఢిల్లీలో బాంబు బెదిరింపులు కొత్తగా వచ్చిన విషయం కాదు. గతంలో కూడా పలు స్కూల్లు, విమానాలు, ఇతర కేంద్రాల పై గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com