ఇంకా తెలియరాని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమాన జాడ

- July 25, 2016 , by Maagulf
ఇంకా తెలియరాని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమాన జాడ

నాలుగు రోజుల కిందట కన్పించకుండా పోయిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏఎన్‌-32 విమానం జాడ ఇంకా తెలియరాలేదు. ఇప్పటివరకు ఎలాంటి శకలాలు గానీ.. సిబ్బందిని గానీ గుర్తించలేకపోయామని కోస్ట్‌గార్డు తూర్పు కమాండర్‌ ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌ రాజన్‌ బర్గోత్రా అన్నారు. విమానం విషయమై రాజన్‌ నేడు మీడియాతో మాట్లాడారు.
అండమాన్‌, నికోబార్‌ నుంచి 13 నౌకలు, 2 తీర భద్రతా ఓడలు విమానం కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. గాలింపు చేపడుతున్న ప్రాంతం పరిధిని కూడా విస్తరిస్తున్నామని ఆయన తెలిపారు. సముద్రం నుంచి కొన్ని వస్తువులు దొరికాయని అయితే అవి గల్లంతైన విమానానివి కాదన్నారు. సముద్ర ఉపరితలంపై ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని.. అవసరమైతే సముద్ర అంతర్భాగంలోనూ వెతుకుతామని రాజన్‌ తెలిపారు.
చెన్నైలోని తాంబరం నుంచి అండమాన్‌ రాజధాని పోర్టుబ్లెయిర్‌ వెళ్తుండగా.. ఏఎన్‌-32 విమానం శుక్రవారం ఉదయం గల్లంతైన విషయం తెలిసిందే. ఎయిర్‌బేస్‌ నుంచి బయలుదేరిన విమానానికి రెండు గంటల తర్వాత రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. విమానంలో ఆరుగురు సిబ్బంది సహా 29 మంది ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com