ఇంకా తెలియరాని ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమాన జాడ
- July 25, 2016
నాలుగు రోజుల కిందట కన్పించకుండా పోయిన ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన ఏఎన్-32 విమానం జాడ ఇంకా తెలియరాలేదు. ఇప్పటివరకు ఎలాంటి శకలాలు గానీ.. సిబ్బందిని గానీ గుర్తించలేకపోయామని కోస్ట్గార్డు తూర్పు కమాండర్ ఇన్స్పెక్టర్ జనరల్ రాజన్ బర్గోత్రా అన్నారు. విమానం విషయమై రాజన్ నేడు మీడియాతో మాట్లాడారు.
అండమాన్, నికోబార్ నుంచి 13 నౌకలు, 2 తీర భద్రతా ఓడలు విమానం కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. గాలింపు చేపడుతున్న ప్రాంతం పరిధిని కూడా విస్తరిస్తున్నామని ఆయన తెలిపారు. సముద్రం నుంచి కొన్ని వస్తువులు దొరికాయని అయితే అవి గల్లంతైన విమానానివి కాదన్నారు. సముద్ర ఉపరితలంపై ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని.. అవసరమైతే సముద్ర అంతర్భాగంలోనూ వెతుకుతామని రాజన్ తెలిపారు.
చెన్నైలోని తాంబరం నుంచి అండమాన్ రాజధాని పోర్టుబ్లెయిర్ వెళ్తుండగా.. ఏఎన్-32 విమానం శుక్రవారం ఉదయం గల్లంతైన విషయం తెలిసిందే. ఎయిర్బేస్ నుంచి బయలుదేరిన విమానానికి రెండు గంటల తర్వాత రాడార్తో సంబంధాలు తెగిపోయాయి. విమానంలో ఆరుగురు సిబ్బంది సహా 29 మంది ఉన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







