ఇంకా తెలియరాని ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమాన జాడ
- July 25, 2016
నాలుగు రోజుల కిందట కన్పించకుండా పోయిన ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన ఏఎన్-32 విమానం జాడ ఇంకా తెలియరాలేదు. ఇప్పటివరకు ఎలాంటి శకలాలు గానీ.. సిబ్బందిని గానీ గుర్తించలేకపోయామని కోస్ట్గార్డు తూర్పు కమాండర్ ఇన్స్పెక్టర్ జనరల్ రాజన్ బర్గోత్రా అన్నారు. విమానం విషయమై రాజన్ నేడు మీడియాతో మాట్లాడారు.
అండమాన్, నికోబార్ నుంచి 13 నౌకలు, 2 తీర భద్రతా ఓడలు విమానం కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. గాలింపు చేపడుతున్న ప్రాంతం పరిధిని కూడా విస్తరిస్తున్నామని ఆయన తెలిపారు. సముద్రం నుంచి కొన్ని వస్తువులు దొరికాయని అయితే అవి గల్లంతైన విమానానివి కాదన్నారు. సముద్ర ఉపరితలంపై ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని.. అవసరమైతే సముద్ర అంతర్భాగంలోనూ వెతుకుతామని రాజన్ తెలిపారు.
చెన్నైలోని తాంబరం నుంచి అండమాన్ రాజధాని పోర్టుబ్లెయిర్ వెళ్తుండగా.. ఏఎన్-32 విమానం శుక్రవారం ఉదయం గల్లంతైన విషయం తెలిసిందే. ఎయిర్బేస్ నుంచి బయలుదేరిన విమానానికి రెండు గంటల తర్వాత రాడార్తో సంబంధాలు తెగిపోయాయి. విమానంలో ఆరుగురు సిబ్బంది సహా 29 మంది ఉన్నారు.
తాజా వార్తలు
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!









