పశ్చిమ్బెంగాల్ లో వరద బీభత్సం
- July 25, 2016
పశ్చిమ్బెంగాల్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. మూడు జిల్లాల్లోని 150 గ్రామాలు జలమయం కావడంతో దాదాపు 58,000 మందిపై వరద ప్రభావం చూపింది. దీంతో ప్రభుత్వం జల్పాయ్గురిలో అప్రమత్తత ప్రకటించింది. అలిపుర్దార్, జల్పాయ్గురి, కూచ్బిహార్లో 58,000 మంది ప్రజలు వరదబారిన పడ్డారని ఆ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిర్వహణ శాఖ మంత్రి జావెద్ఖాన్ తెలిపారు. వరద ప్రభావిత జిల్లాలో మొత్తం 43 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, ప్రజలను ఇళ్ల నుంచి తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎగువ రాష్ట్రమైన సిక్కిం, భూటాన్ దేశంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో బంగాల్ను వరదలు ముంచెత్తుతున్నాయి.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







