పశ్చిమ్‌బెంగాల్​ లో వరద బీభత్సం

- July 25, 2016 , by Maagulf
పశ్చిమ్‌బెంగాల్​ లో వరద బీభత్సం

పశ్చిమ్‌బెంగాల్​ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. మూడు జిల్లాల్లోని 150 గ్రామాలు జలమయం కావడంతో దాదాపు 58,000 మందిపై వరద ప్రభావం చూపింది. దీంతో ప్రభుత్వం జల్పాయ్‌గురిలో అప్రమత్తత ప్రకటించింది. అలిపుర్‌దార్‌, జల్‌పాయ్‌గురి, కూచ్‌బిహార్‌లో 58,000 మంది ప్రజలు వరదబారిన పడ్డారని ఆ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిర్వహణ శాఖ మంత్రి జావెద్‌ఖాన్‌ తెలిపారు. వరద ప్రభావిత జిల్లాలో మొత్తం 43 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, ప్రజలను ఇళ్ల నుంచి తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎగువ రాష్ట్రమైన సిక్కిం, భూటాన్‌ దేశంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో బంగాల్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com