ఏపీ: నిరుద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలు
- December 02, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు కల్పించడానికి కౌశలం కార్యక్రమం చేపట్టింది.రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో కంప్యూటర్ ఆధారిత నైపుణ్య పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలలో విద్యార్హత, నైపుణ్యాలు, కమ్యూనికేషన్ సామర్థ్యం, వృత్తి నైపుణ్యతను అంచనా వేస్తారు.
పరీక్షలు ఉదయం 11 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు, మొత్తం 45 నిమిషాలపాటు నిర్వహించబడతాయి. ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, వెర్బల్ అండ్ లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, సైకోమెట్రిక్ అసెస్మెంట్, వ్యక్తిగత మరియు సాంకేతిక ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు ఇంగ్లీషులో కొన్ని ప్రశ్నలకు 30 సెకన్లుగా జవాబు ఇచ్చి వెబ్ కెమెరాలో రికార్డ్ చేయించాలి.
పరీక్ష రాసే సమయంలో కెమెరా, మైక్రోఫోన్, ఫుల్ స్క్రీన్, లొకేషన్ యాక్సెస్ తప్పనిసరి. నియమాలు పాటించకపోతే అభ్యర్థి అర్హత కోల్పోతారు. ఈ కౌశలం కార్యక్రమం ద్వారా యువతకు స్థిరమైన వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలు, ఉపాధి మార్గాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









