ఏపీ: నిరుద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలు
- December 02, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు కల్పించడానికి కౌశలం కార్యక్రమం చేపట్టింది.రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో కంప్యూటర్ ఆధారిత నైపుణ్య పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలలో విద్యార్హత, నైపుణ్యాలు, కమ్యూనికేషన్ సామర్థ్యం, వృత్తి నైపుణ్యతను అంచనా వేస్తారు.
పరీక్షలు ఉదయం 11 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు, మొత్తం 45 నిమిషాలపాటు నిర్వహించబడతాయి. ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, వెర్బల్ అండ్ లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, సైకోమెట్రిక్ అసెస్మెంట్, వ్యక్తిగత మరియు సాంకేతిక ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు ఇంగ్లీషులో కొన్ని ప్రశ్నలకు 30 సెకన్లుగా జవాబు ఇచ్చి వెబ్ కెమెరాలో రికార్డ్ చేయించాలి.
పరీక్ష రాసే సమయంలో కెమెరా, మైక్రోఫోన్, ఫుల్ స్క్రీన్, లొకేషన్ యాక్సెస్ తప్పనిసరి. నియమాలు పాటించకపోతే అభ్యర్థి అర్హత కోల్పోతారు. ఈ కౌశలం కార్యక్రమం ద్వారా యువతకు స్థిరమైన వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలు, ఉపాధి మార్గాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.
తాజా వార్తలు
- దోహా ఫోరం 2025: QR2.016 బిలియన్ల విలువైన ఒప్పందాలు..!!
- అల్-రాయ్లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- యునెస్కో జాబితాలో ఒమన్ 'బిష్ట్' రిజిస్టర్..!!
- బహ్రెయిన్ లో నేషనల్ డే ,యాక్సెషన్ డే సెలవులు అనౌన్స్..!!
- అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- సౌదీ అరేబియాలో చల్లబడ్డ వాతావరణం..!!
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!







