హైదరాబాద్లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ–ప్రేక్షకులకు ఫ్రీ ఎంట్రీ!
- December 02, 2025
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు ఈ సీజన్ ప్రత్యేకంగా మారింది.నగరంలో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ (SMAT) మ్యాచ్లకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.ఈ అవకాశంతో రోజువారీగా స్టేడియాల్లో భారీగా క్రికెట్ అభిమానులు చేరుకుంటున్నారు.అంతేకాదు, ఈసారి పాల్గొంటున్న ఇండియా టీమ్ స్టార్ ప్లేయర్లు కారణంగా ఉత్సాహం మరింత రెట్టింపైంది.
ఈ టోర్నీలో పాల్గొంటున్న ప్రధాన క్రికెటర్లు
- హార్దిక్ పాండ్య – గాయానంతరం మళ్లీ ఫిట్గా కనిపిస్తున్న ఆల్రౌండర్
- కృనాల్ పాండ్య – అద్భుత ఫార్మ్లో ఉన్న ఆల్రౌండర్
- ఇషాన్ కిషన్ – టీమ్ ఇండియా మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్మన్
- అభిషేక్ శర్మ – ఐపీఎల్లో సత్తా చాటిన పవర్ హిట్టర్
- మహ్మద్ షమీ – టీమ్ ఇండియా స్టార్ పేసర్
- హర్షల్ పటేల్ – డెత్ ఓవర్ల ప్రత్యేక నిపుణుడు
ఈ స్టార్ ప్లేయర్లను(FreeEntry) ప్రత్యక్షంగా చూస్తున్న అభిమానులు సోషల్ మీడియాలో కూడా పిక్స్, వీడియోలు షేర్ చేస్తూ ఫుల్ జోష్లో ఉన్నారు.
మ్యాచ్లు జరుగుతున్న మైదానాలు
- రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, ఉప్పల్
- జింఖానా గ్రౌండ్
- ఎల్బీ స్టేడియం
మూడు స్టేడియాల్లోనూ సెక్యూరిటీ, పార్కింగ్, ఫుడ్ కోర్టులు వంటి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశీయ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ టోర్నీలో ఈ స్థాయి క్రికెటర్లు ఆడటం అరుదైన విషయం. అందుకే అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







