తులసితో కిడ్నీలో రాళ్లు మాయం

- July 18, 2015 , by Maagulf
తులసితో కిడ్నీలో రాళ్లు మాయం


మన పెరట్లో సులువుగా పెరిగే తులసితో ఎంత ఆరోగ్యమో మనందరికీ తెలుసు. తులసి గాలిని పీల్చడం వల్ల గాలి ద్వారా వచ్చే అనేక రోగాలు తొలగిపోతాయి. ప్రతిరోజూ తులసి ఆకుల రసం తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు దూరం అవుతాయని శాస్త్రవేత్త అధ్యయనంలో వెల్లడైంది. పది తులసి ఆకులను మరుగుతున్న నీటిలో వేసి కొంచెం సేపు మూత పెట్టాలి. తరువాత ఆ నీటిని ప్రతిరోజూ తీసుకుంటే క్రమక్రమంగా కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి. జలుబు, జ్వరం గొంతు నొప్పి లాంటివి ఉంటే తులసి ఆకులను గోరు వెచ్చని నీటిలో వేసుకుని తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది. తులసిని తరచూ తీసుకోవడం వల్ల దంత సమస్యలు రాకుండా ఉంటాయి. తులసి ఆకుల పొడిలో కొద్దిగా ఆవ నూనె చేర్చి దానితో పళ్లు తోముకోవడం వల్ల చిగుళ్ల వాపు, రక్తం కారడంలాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. తులసిలోని యాంటి బాక్టీరియల్, యాంటీ బయోటిక్ గుణాలు మన శరీరానికి సంబంధించిన అనేక రోగాలకు మంచి మందుగా పని చేస్తాయి. ఏవైనా పురుగులు కుట్టడం, వాటి వల్ల వచ్చే పుండ్లు మానడానికి కూడా తులసి రసం మంచి ఔషధంగా పని చేస్తుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com