సాహితీ లోకం ఆత్మీయురాలు సుధ ను కోల్పోయింది: నటుడు రాజేంద్ర ప్రసాద్
- December 04, 2025
హైదరాబాద్: ప్రముఖ రచయిత్రి డాక్టర్ తెన్నేటి సుధా దేవి అకస్మాత్తుగా కన్నుమూయడం తీవ్ర విషాదకరమని నటుడు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.ఆమె సామాజిక అవగాహనతో, అపార అనుభవంతో రచనలు చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని పేర్కొన్నారు.సాహితీ ప్రపంచం ఆత్మీయురాలిని కోల్పోయిందని ఆయన వేదన వ్యక్తం చేశారు.
ఇటీవల మరణించిన సుధా దేవి స్మరణార్థం, ఆమె కుటుంబ సభ్యులు వంశీ రామరాజు, వంశీధర్, వంశీ కృష్ణ మరియు గాయకుడు వై.ఎస్.రామకృష్ణ తదితరుల ఆధ్వర్యంలో రాఘవేంద్ర స్వామి మఠం ఆడిటోరియంలో స్మృతిసభ జరిగింది.
ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ—రాజేంద్ర ప్రసాద్: సుధా దేవి ఎంతో అనురాగంతో పలకరించే వ్యక్తి. తనకు ఆమె ‘అమ్మ’ లాంటివారని చెప్పారు.
దర్శకుడు రేలంగి నరసింహారావు: వంశీ రామరాజు అంతర్జాతీయ గుర్తింపు పొందడంలో సుధా దేవి అతనికి అండగా నిలిచారని తెలిపారు.
డాక్టర్ వోలేటి పార్వతీశం: తెలుగు అకాడమీలో ఉప సంచాలకురాలిగా పనిచేసిన ఆమె అనేక తరగతుల పాఠ్యపుస్తకాలకు రూపకల్పన చేసింది అన్నారు.
కళా జనార్థనమూర్తి (త్యాగరాయ గానసభ): సుధా దేవి రచనలు కాలాతీతమని, ఆమె పేరిట ప్రతి సంవత్సరం ఒక రచయిత్రికి అవార్డు ఇవ్వాలని సూచించారు.
ఇట్లా సంస్థ అధ్యక్షుడు ధర్మారావు: ఆమె తెలంగాణకు చెందిన గొప్ప రచయిత్రి అని అభివర్ణించారు.
కళ పత్రిక సంపాదకుడు రఫీ: సుధా దేవి కథల్లో ఆమె వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుందని అన్నారు.
దైవజ్ఞ శర్మ: ఆమె రచనలు ఆమెను చిరస్థాయిగా నిలబెడతాయని చెప్పారు.
కిన్నెర సంస్థ రఘురాం, అభినందన సంస్థ భవాని, జి.వి.ఆర్. ఆరాధన సంస్థ రాఘవరెడ్డి, సాహితీ కిరణం సంపాదకుడు పొత్తూరి సుబ్బారావు, కవి పెద్దూరి వెంకటదాసు, రచయిత్రి రాజ్యశ్రీ, సినీ నిర్మాత రామ సత్యనారాయణ, ప్రచురణకర్త జ్యోతి వల్లభోజ్యుల తదితరులు పాల్గొని సుధా దేవితో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
శాసనసభ మాజీ సభాపతి సిరికొండ మధుసూదనాచారి, డాక్టర్ వకుళభరణం కృష్ణమోహన్ రావు, గజల్ శ్రీనివాస్ కూడా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా, సుధా దేవి మరణానికి ముందు ప్రచురణకు అందించిన కథల సంపుటి—భాగం 2—ను రాజేంద్ర ప్రసాద్, రేలంగి నరసింహారావు, వంశీ రామరాజు మరియు ఇతర ప్రముఖులు కలిసి ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







