కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
- December 04, 2025
న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 87 నకిలీ, అనధికారిక లోన్ యాప్స్ పై బ్యాన్ విధించింది కేంద్రం. అనధికారిక లోన్ యాప్స్ పై బ్యాన్ విధించినట్లు లోక్ సభలో ప్రకటించింది. సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని, అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు అని వినియోగదారుల ఫిర్యాదులతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా పౌరుల భద్రత, ఆర్థిక రక్షణ కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కేంద్రం స్పష్టం చేసింది.
భారత ప్రభుత్వం 87 ఇల్లీగల్ లోన్ యాప్స్ బ్లాక్ చేసినట్లు ధృవీకరించింది. ఈ ఆదేశాన్ని ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 69Aలో పేర్కొన్న చట్టబద్ధమైన అధికారాల ప్రకారం నిషేధం విధించింది.
ఈ చర్యను కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా లోక్సభలో అధికారికంగా తెలిపారు. అనధికారిక, తరచుగా దోపిడీ చేసే డిజిటల్ లెండర్స్ (రుణదాతలు) కార్యకలాపాలపై పెరుగుతున్న ప్రజల ఆందోళనను ఈ చర్య పరిష్కరిస్తుంది. ఆర్బీఐ నిర్దేశించిన గైడ్ లైన్స్ ను ఈ ప్లాట్ఫామ్లు తరచుగా ఉల్లంఘిస్తున్నాయి. అంతేకాదు ఇవి బలవంతపు లోన్ రికవరీ పద్ధతులకు ప్రసిద్ధి పొందాయి.
ఈ లోన్ యాప్స్ వేధింపులకు పాల్పడుతున్నాయి. అధిక వడ్డీలు వసూలు చేస్తున్నాయి. అంతేకాదు వినియోగదారుల వ్యక్తిగత డేటాను చట్టవిరుద్ధంగా యాక్సెస్ చేయడం, డేటాను దుర్వినియోగం చేయడం వంటివి చేస్తున్నాయని కేంద్రం గుర్తించింది.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







