కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
- December 04, 2025
న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 87 నకిలీ, అనధికారిక లోన్ యాప్స్ పై బ్యాన్ విధించింది కేంద్రం. అనధికారిక లోన్ యాప్స్ పై బ్యాన్ విధించినట్లు లోక్ సభలో ప్రకటించింది. సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని, అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు అని వినియోగదారుల ఫిర్యాదులతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా పౌరుల భద్రత, ఆర్థిక రక్షణ కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కేంద్రం స్పష్టం చేసింది.
భారత ప్రభుత్వం 87 ఇల్లీగల్ లోన్ యాప్స్ బ్లాక్ చేసినట్లు ధృవీకరించింది. ఈ ఆదేశాన్ని ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 69Aలో పేర్కొన్న చట్టబద్ధమైన అధికారాల ప్రకారం నిషేధం విధించింది.
ఈ చర్యను కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా లోక్సభలో అధికారికంగా తెలిపారు. అనధికారిక, తరచుగా దోపిడీ చేసే డిజిటల్ లెండర్స్ (రుణదాతలు) కార్యకలాపాలపై పెరుగుతున్న ప్రజల ఆందోళనను ఈ చర్య పరిష్కరిస్తుంది. ఆర్బీఐ నిర్దేశించిన గైడ్ లైన్స్ ను ఈ ప్లాట్ఫామ్లు తరచుగా ఉల్లంఘిస్తున్నాయి. అంతేకాదు ఇవి బలవంతపు లోన్ రికవరీ పద్ధతులకు ప్రసిద్ధి పొందాయి.
ఈ లోన్ యాప్స్ వేధింపులకు పాల్పడుతున్నాయి. అధిక వడ్డీలు వసూలు చేస్తున్నాయి. అంతేకాదు వినియోగదారుల వ్యక్తిగత డేటాను చట్టవిరుద్ధంగా యాక్సెస్ చేయడం, డేటాను దుర్వినియోగం చేయడం వంటివి చేస్తున్నాయని కేంద్రం గుర్తించింది.
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







