భారత్కు పుతిన్.. స్వాగతం పలికిన ప్రధాని మోదీ
- December 04, 2025
న్యూ ఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు చేరుకున్నారు. ఢిల్లీలోని పాలం ఎయిర్పోర్ట్లో ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్కు ఘన స్వాగతం పలికారు. పుతిన్ రెండు రోజుల పాటు మన దేశంలో పర్యటించనున్నారు. ఉక్రెయిన్తో రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత్కు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. భారత్-రష్యా వార్షికోత్సవ సదస్సులో ఇరుదేశాల అధినేతలు పాల్గొననున్న సంగతి తెలిసిందే.
ఈ సదస్సులో పలు కీలక ఒప్పందాలు జరగనున్నాయి. వాణిజ్యం, ఆర్థికం, ఆరోగ్యం, అకాడమిక్స్, సంప్రదాయం, మీడియా రంగాలకు సంబంధించి పలు ఒప్పందాలపై ఇరుదేశాధినేతలు సంతకాలు చేయనున్నట్లు సమాచారం. అలాగే రక్షణ రంగంలో కూడా కీలక ఒప్పందాలు జరగనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ కూడా పుతిన్ ను రాష్ట్రపతి భవన్లో ప్రత్యేక స్వాగతం పలకనున్నారు.
చివరిసారిగా పుతిన్ 2021లో భారత్కు వచ్చారు. ఆ తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. దీంతో నాలుగేళ్ల తర్వాత ఆయన మరోసారి భారత్లో అడుగుపెట్టారు. ఇరుదేశాధినేతలు ఎలాంటి అంశాలపై ఒప్పందం కుదుర్చుకోనున్నారనేదానిపై ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
- భారత్కు పుతిన్.. స్వాగతం పలికిన ప్రధాని మోదీ
- సాహితీ లోకం ఆత్మీయురాలు సుధ ను కోల్పోయింది: నటుడు రాజేంద్ర ప్రసాద్
- నిజాం దర్బారుకు ప్రతీకగా హైదరాబాద్ హౌస్
- BKS-DC ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- 4 రోజులపాటు అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ క్లోజ్..!!
- 2026 లో రియాద్ లో కొత్త మెట్రో ట్రాక్..!!
- భారత్ కు మూడు రెట్లు డబ్బు పంపుతున్న యూఏఈ నివాసితులు..!!
- వాణిజ్య, పెట్టుబడుల విస్తరణ పై ఒమన్, భారత్ చర్చలు..!!
- ఖతార్ వర్క్ఫోర్స్ కోసం ఖతార్, ILO ఒప్పందం..!!







