భారత్కు పుతిన్.. స్వాగతం పలికిన ప్రధాని మోదీ
- December 04, 2025
న్యూ ఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు చేరుకున్నారు. ఢిల్లీలోని పాలం ఎయిర్పోర్ట్లో ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్కు ఘన స్వాగతం పలికారు. పుతిన్ రెండు రోజుల పాటు మన దేశంలో పర్యటించనున్నారు. ఉక్రెయిన్తో రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత్కు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. భారత్-రష్యా వార్షికోత్సవ సదస్సులో ఇరుదేశాల అధినేతలు పాల్గొననున్న సంగతి తెలిసిందే.
ఈ సదస్సులో పలు కీలక ఒప్పందాలు జరగనున్నాయి. వాణిజ్యం, ఆర్థికం, ఆరోగ్యం, అకాడమిక్స్, సంప్రదాయం, మీడియా రంగాలకు సంబంధించి పలు ఒప్పందాలపై ఇరుదేశాధినేతలు సంతకాలు చేయనున్నట్లు సమాచారం. అలాగే రక్షణ రంగంలో కూడా కీలక ఒప్పందాలు జరగనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ కూడా పుతిన్ ను రాష్ట్రపతి భవన్లో ప్రత్యేక స్వాగతం పలకనున్నారు.
చివరిసారిగా పుతిన్ 2021లో భారత్కు వచ్చారు. ఆ తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. దీంతో నాలుగేళ్ల తర్వాత ఆయన మరోసారి భారత్లో అడుగుపెట్టారు. ఇరుదేశాధినేతలు ఎలాంటి అంశాలపై ఒప్పందం కుదుర్చుకోనున్నారనేదానిపై ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన







