జమిలి ఎన్నికల పై కొనసాగుతున్న చర్చలు
- December 06, 2025
న్యూ ఢిల్లీ: జమిలి ఎన్నికల చట్ట పర్యావరణంపై కేంద్రం నిపుణుల చర్చలు కొనసాగిస్తున్నది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ పరిగణనలో, ప్రతిపాదిత జమిలి బిల్లులకు రాష్ట్ర శాసనసభల ఆమోదం అవసరం లేదని 23వ లా కమిషన్ పేర్కొంది.ఈ బిల్లులు రాజ్యాంగంలోని మౌలిక నిర్మాణాన్ని మార్చడం లేదా సమాఖ్య విధానానికి హానికరం కలిగించడం లేదని కమిషన్ వివరించింది. లోక్సభ, శాసనసభల ఎన్నికలను ఒకే సమయానికి నిర్వహించడం ద్వారా ప్రజల ఓటు హక్కుకు ఎటువంటి నష్టం కలగదు అని స్పష్టం చేశారు.
జేపీసీ ఇప్పటికే వివిధ వర్గాలతో చర్చలు జరిపింది.లా కమిషన్ సూచనలతో మరిన్ని నిపుణులు, సంస్థలతో చర్చలు కొనసాగించబడి, ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాల్లో నివేదిక సమర్పించనుంది. రాజ్యాంగంలోని 368వ,324వ అధికరణల కింద ఎన్నికల కమిషన్కు ఇచ్చిన అధికారాలపై వచ్చిన సందేహాలను కమిషన్ తొలగించింది.ఈ నివేదిక పై చర్చ తరువాత, కేంద్రం తుది నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









