జమిలి ఎన్నికల పై కొనసాగుతున్న చర్చలు
- December 06, 2025
న్యూ ఢిల్లీ: జమిలి ఎన్నికల చట్ట పర్యావరణంపై కేంద్రం నిపుణుల చర్చలు కొనసాగిస్తున్నది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ పరిగణనలో, ప్రతిపాదిత జమిలి బిల్లులకు రాష్ట్ర శాసనసభల ఆమోదం అవసరం లేదని 23వ లా కమిషన్ పేర్కొంది.ఈ బిల్లులు రాజ్యాంగంలోని మౌలిక నిర్మాణాన్ని మార్చడం లేదా సమాఖ్య విధానానికి హానికరం కలిగించడం లేదని కమిషన్ వివరించింది. లోక్సభ, శాసనసభల ఎన్నికలను ఒకే సమయానికి నిర్వహించడం ద్వారా ప్రజల ఓటు హక్కుకు ఎటువంటి నష్టం కలగదు అని స్పష్టం చేశారు.
జేపీసీ ఇప్పటికే వివిధ వర్గాలతో చర్చలు జరిపింది.లా కమిషన్ సూచనలతో మరిన్ని నిపుణులు, సంస్థలతో చర్చలు కొనసాగించబడి, ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాల్లో నివేదిక సమర్పించనుంది. రాజ్యాంగంలోని 368వ,324వ అధికరణల కింద ఎన్నికల కమిషన్కు ఇచ్చిన అధికారాలపై వచ్చిన సందేహాలను కమిషన్ తొలగించింది.ఈ నివేదిక పై చర్చ తరువాత, కేంద్రం తుది నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో కిడ్నీ రోగులకు ఊరట ..!!
- లేబర్ ఫోర్సులో కువైటీలు 11శాతం..!!
- సుల్తాన్ ఖబూస్ యూనివర్సిటీలో స్నాతకోత్సవం సందడి..!!
- ఇజ్రాయెల్ ప్రకటనపై 8 అరబ్ ఇస్లామిక్ దేశాలు ఆందోళన..!!
- డ్రగ్స్ తో తడిసిన పేపర్ పార్సిల్..మహిళకు జైలుశిక్ష..!!
- సౌదీలో 18శాతం పెరిగిన దేశీయ పర్యాటక వ్యయం..!!
- హైదరాబాద్లో అల్లూ సినిమాస్ కొత్త డాల్బీ థియేటర్
- ఆఫీస్ తరువాత ఫోన్ కాల్స్, మెయిల్స్ను ఉద్యోగులు పట్టించుకోకండి..
- జమిలి ఎన్నికల పై కొనసాగుతున్న చర్చలు
- ఏపీ: ఈరోజు మెగా జాబ్ మేళా







