డ్రగ్స్ తో తడిసిన పేపర్ పార్సిల్..మహిళకు జైలుశిక్ష..!!
- December 06, 2025
దుబాయ్: డ్రగ్స్ కేసులో మధ్య ఆసియాకు చెందిన ఒక మహిళకు దుబాయ్ కోర్టు జైలుశిక్ష విధించింది. తన స్నేహితురాలి పాస్పోర్ట్ కాపీని ఉపయోగించి మాదకద్రవ్యాలతో తడిసిన కాగితాలను కలిగి ఉన్నట్లు తేలిన పార్శిల్ను సేకరించినందుకు దుబాయ్ కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. ఆమెను దేశం నుండి బహిష్కరించాలని ఆదేశించింది. దుబాయ్ క్రిమినల్ కోర్టు తన స్నేహితురాలిని నిర్దోషిగా ప్రకటించింది. ఆమె నేరంలో పాల్గొనలేదని తీర్పు చెప్పింది.
ఈ సంవత్సరం ఏప్రిల్లో యూరోపియన్ దేశం నుండి వస్తున్న పార్శిల్పై కస్టమ్స్ ఇన్స్పెక్టర్ అనుమానం రావడంతో తనిఖీ చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. ప్యాకేజీలో మాదకద్రవ్యాలతో నిండిన షీట్లు ఉన్నాయని మాన్యువల్ తనిఖీలో వెల్లడైంది. వాటిని తీసుకోబోయే మహిళను అరెస్టు చేసేందుకు అధికారులు ఆపరేషన్ ప్రారంభించారు.
నిందితురాలు పార్శిల్ను తీసుకోవడానికి షిప్పింగ్ కంపెనీ కార్యాలయానికి వచ్చింది. ఆమె తన సొంత గుర్తింపు అని పేర్కొంటూ తన స్నేహితురాలి పాస్పోర్ట్ ఫ్రింట్ కాపీని సమర్పించింది. కస్టమ్స్ బృందం మరియు పోలీసు అధికారులు ఆమెను అక్కడికక్కడే అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. తనిఖీలో ఆమె మరొక మహిళ పాస్పోర్ట్ కాపీని ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. ఆమెను వెంటనే విచారణ కోసం పిలిపించారు. పాస్పోర్ట్ ఒరిజినల్ హోల్డర్ డ్రగ్ రవాణా లేదా సంఘటన గురించి తనకు తెలియదని వెల్లడించింది.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









