ఇజ్రాయెల్ ప్రకటనపై 8 అరబ్ ఇస్లామిక్ దేశాలు ఆందోళన..!!
- December 06, 2025
దోహా: గాజా నివాసితులు ఈజిప్టులోకి ప్రవేశించడానికి వీలుగా రఫా క్రాసింగ్ను ఒక దిశలో మాత్రమే తెరవాలని ఇజ్రాయెల్ ప్రకటించడంపై ఎనిమిది అరబ్ ఇస్లామిక్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇజ్రాయెల్ ప్రకటనను ఖండించిన దేశాల్లో ఖతార్, ఈజిప్ట్, హాషెమైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా, పాకిస్తాన్, టర్కి, సౌదీ అరేబియా ఉన్నాయి. ఆయా దేశాల విదేశాంగ మంత్రులు పేరిట ఈ మేరకు ప్రకటన విడుదలైంది.
పాలస్తీనా ప్రజలను వారి భూమి నుండి తరిమివేసే ప్రయత్నాలను పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికకు పూర్తిగా కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. రెండు దిశలలో రఫా క్రాసింగ్ను తెరవాలని డిమాండ్ చేశారు. స్థానికులు స్వేచ్ఛగా ప్రయాణించే హక్కు కల్పించాలని సూచించారు.
అదే సమయంలో మానవతా సాయాన్ని అన్ని ప్రాంతాలకు అనుమతించాలని, వారి మాతృభూమిని నిర్మించుకోవడంలో వారికి తగిన పరిస్థితులను కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి కాల్పుల విరమణను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సూచించారు. పాలస్తీనా అథారిటీ గాజా స్ట్రిప్లో తన బాధ్యతలను తిరిగి చేపట్టడానికి అనుమతించాలన్నారు.
UN భద్రతా మండలి తీర్మానం 2803 ద్వారా టూస్టేట్ పరిష్కారానికి అనుగుణంగా న్యాయమైన సహాయాన్ని అందించేందుకు ముందుంటామని వెల్లడించాయి. జూన్ 4, 1967 సరిహద్దులలో తూర్పు జెరూసలేం రాజధానిగా ఉన్న గాజా మరియు వెస్ట్ బ్యాంక్ ఆక్రమిత భూభాగాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









