ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- December 08, 2025
మస్కట్: ఒమన్ - ఇండియా మధ్య జరిగిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై షురా కౌన్సిల్ ఆర్థిక కమిటీ చర్చించింది. కౌన్సిల్ చైర్మన్ ఖలీద్ అల్ మావాలి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడుల ప్రమోషన్ శాఖ మంత్రి ఖైస్ అల్ యూసఫ్ తోపాటు పలువురు ఆర్థిక రంగ నిపుణులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఒప్పందంలోని కీలక ఆర్థిక మరియు పెట్టుబడి క్లాజులపై విస్తృతమైన చర్చలు జరిగాయి. ప్రతిపాదిత ఒప్పందంపై మంత్రిత్వ శాఖ తరఫున మంత్రి కమిటీ సభ్యులకు బ్రీఫింగ్ ఇచ్చారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచడానికి, జాతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క పోటీతత్వాన్ని పెంచడానికి, ఉత్పాదక రంగాల అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి , వివిధ రంగాలలో పెట్టుబడులను ప్రారంభించడానికి భారత్ తో కుదిరిన ఒప్పందం అందించే అవకాశాలను వివరించారు. అన్ని విషయాలపై కూలంకషంగా చర్చించిన ఆర్థిక కమిటీ భారత్ తో ఒప్పందాన్ని ఆమోదించిందని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







