ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- December 08, 2025
మస్కట్: ఒమన్ - ఇండియా మధ్య జరిగిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై షురా కౌన్సిల్ ఆర్థిక కమిటీ చర్చించింది. కౌన్సిల్ చైర్మన్ ఖలీద్ అల్ మావాలి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడుల ప్రమోషన్ శాఖ మంత్రి ఖైస్ అల్ యూసఫ్ తోపాటు పలువురు ఆర్థిక రంగ నిపుణులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఒప్పందంలోని కీలక ఆర్థిక మరియు పెట్టుబడి క్లాజులపై విస్తృతమైన చర్చలు జరిగాయి. ప్రతిపాదిత ఒప్పందంపై మంత్రిత్వ శాఖ తరఫున మంత్రి కమిటీ సభ్యులకు బ్రీఫింగ్ ఇచ్చారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచడానికి, జాతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క పోటీతత్వాన్ని పెంచడానికి, ఉత్పాదక రంగాల అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి , వివిధ రంగాలలో పెట్టుబడులను ప్రారంభించడానికి భారత్ తో కుదిరిన ఒప్పందం అందించే అవకాశాలను వివరించారు. అన్ని విషయాలపై కూలంకషంగా చర్చించిన ఆర్థిక కమిటీ భారత్ తో ఒప్పందాన్ని ఆమోదించిందని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









