ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- December 08, 2025
మనామా: న్యూఢిల్లీలోని తాజ్ మహల్ హోటల్లో జరిగిన 4వ IBA ఇండియా లిటిగేషన్ మరియు ADR సింపోజియంలో బహ్రెయిన్ అంతర్జాతీయ వివాద పరిష్కార మండలి సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ మారికే పట్రాని పాల్సన్ పాల్గొన్నారు. "ప్రైవసీ, జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (GDPR), ఇండియాస్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్" అనే అంశంపై జరిగిన ప్యానెల్ చర్చలో పాల్గొన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, సోషల్ మీడియా నియంత్రణ తదితర అంశాలపై ఆమె తన అభిప్రాయాలను వెల్లడించారు. వ్యక్తిగత ప్రైవసీ, డేటా రక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ సింపోజియంలో ప్రముఖ సీనియర్ న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు మరియు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. డిజిటల్ చట్టం మరియు మానవ హక్కులలో ప్రస్తుత పరిణామాలను ప్రస్తావించే ఒక ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ను నిర్వహించారు. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో సంక్లిష్ట వివాదాలను పరిష్కరించడానికి అమల్లో ఉన్న చట్టాలను మరింత బలోపేతం చేసే ప్రయత్నాలను ఈ సదర్భంగా సమీక్షించారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







