ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- December 08, 2025
మనామా: న్యూఢిల్లీలోని తాజ్ మహల్ హోటల్లో జరిగిన 4వ IBA ఇండియా లిటిగేషన్ మరియు ADR సింపోజియంలో బహ్రెయిన్ అంతర్జాతీయ వివాద పరిష్కార మండలి సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ మారికే పట్రాని పాల్సన్ పాల్గొన్నారు. "ప్రైవసీ, జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (GDPR), ఇండియాస్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్" అనే అంశంపై జరిగిన ప్యానెల్ చర్చలో పాల్గొన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, సోషల్ మీడియా నియంత్రణ తదితర అంశాలపై ఆమె తన అభిప్రాయాలను వెల్లడించారు. వ్యక్తిగత ప్రైవసీ, డేటా రక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ సింపోజియంలో ప్రముఖ సీనియర్ న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు మరియు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. డిజిటల్ చట్టం మరియు మానవ హక్కులలో ప్రస్తుత పరిణామాలను ప్రస్తావించే ఒక ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ను నిర్వహించారు. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో సంక్లిష్ట వివాదాలను పరిష్కరించడానికి అమల్లో ఉన్న చట్టాలను మరింత బలోపేతం చేసే ప్రయత్నాలను ఈ సదర్భంగా సమీక్షించారు.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







