ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- December 08, 2025
మనామా: న్యూఢిల్లీలోని తాజ్ మహల్ హోటల్లో జరిగిన 4వ IBA ఇండియా లిటిగేషన్ మరియు ADR సింపోజియంలో బహ్రెయిన్ అంతర్జాతీయ వివాద పరిష్కార మండలి సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ మారికే పట్రాని పాల్సన్ పాల్గొన్నారు. "ప్రైవసీ, జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (GDPR), ఇండియాస్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్" అనే అంశంపై జరిగిన ప్యానెల్ చర్చలో పాల్గొన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, సోషల్ మీడియా నియంత్రణ తదితర అంశాలపై ఆమె తన అభిప్రాయాలను వెల్లడించారు. వ్యక్తిగత ప్రైవసీ, డేటా రక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ సింపోజియంలో ప్రముఖ సీనియర్ న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు మరియు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. డిజిటల్ చట్టం మరియు మానవ హక్కులలో ప్రస్తుత పరిణామాలను ప్రస్తావించే ఒక ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ను నిర్వహించారు. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో సంక్లిష్ట వివాదాలను పరిష్కరించడానికి అమల్లో ఉన్న చట్టాలను మరింత బలోపేతం చేసే ప్రయత్నాలను ఈ సదర్భంగా సమీక్షించారు.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







