అల్-రాయ్లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- December 10, 2025
కువైట్: అల్-రాయ్ ప్రాంతంలోని నిర్మాణ స్థలంలో జరిగిన ల్యాండ్ స్లైడ్ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించినట్లు జనరల్ ఫైర్ ఫోర్స్ ప్రకటించింది. గంటల తరబడి తీవ్ర ప్రయత్నాల తర్వాత ఇసుక కింద చిక్కుకున్న రెండవ కార్మికుడిని బయటకు తీయడంలో రెస్క్యూ బృందాలు విజయం సాధించాయని అగ్నిమాపక దళంలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అల్-గారిబ్ ధృవీకరించారు. కానీ, అప్పటికే అతను మరణించాడని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి అగ్నిమాపక బృందాలు, సంబంధిత ఏజెన్సీలతో పాటు, సైట్ కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నాయని అల్-గారిబ్ తెలిపారు.
అల్-రాయ్ పారిశ్రామిక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనంలో ఒక్కసారిగా ల్యాండ్ స్లైడ్ ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. తొలుత ఒక కార్మికుడు మరణించగా, మరొక కార్మికుడు చిక్కుకుపోయాడు. అన్ని శిధిలాలను తొలగించి, సైట్ పూర్తిగా సురక్షితంగా ఉండే వరకు జనరల్ ఫైర్ ఫోర్స్ ఫీల్డ్ ఆపరేషన్లను కొనసాగిస్తుందని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







