అల్-రాయ్లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- December 10, 2025
కువైట్: అల్-రాయ్ ప్రాంతంలోని నిర్మాణ స్థలంలో జరిగిన ల్యాండ్ స్లైడ్ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించినట్లు జనరల్ ఫైర్ ఫోర్స్ ప్రకటించింది. గంటల తరబడి తీవ్ర ప్రయత్నాల తర్వాత ఇసుక కింద చిక్కుకున్న రెండవ కార్మికుడిని బయటకు తీయడంలో రెస్క్యూ బృందాలు విజయం సాధించాయని అగ్నిమాపక దళంలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అల్-గారిబ్ ధృవీకరించారు. కానీ, అప్పటికే అతను మరణించాడని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి అగ్నిమాపక బృందాలు, సంబంధిత ఏజెన్సీలతో పాటు, సైట్ కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నాయని అల్-గారిబ్ తెలిపారు.
అల్-రాయ్ పారిశ్రామిక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనంలో ఒక్కసారిగా ల్యాండ్ స్లైడ్ ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. తొలుత ఒక కార్మికుడు మరణించగా, మరొక కార్మికుడు చిక్కుకుపోయాడు. అన్ని శిధిలాలను తొలగించి, సైట్ పూర్తిగా సురక్షితంగా ఉండే వరకు జనరల్ ఫైర్ ఫోర్స్ ఫీల్డ్ ఆపరేషన్లను కొనసాగిస్తుందని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!









