అల్-రాయ్లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- December 10, 2025
కువైట్: అల్-రాయ్ ప్రాంతంలోని నిర్మాణ స్థలంలో జరిగిన ల్యాండ్ స్లైడ్ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించినట్లు జనరల్ ఫైర్ ఫోర్స్ ప్రకటించింది. గంటల తరబడి తీవ్ర ప్రయత్నాల తర్వాత ఇసుక కింద చిక్కుకున్న రెండవ కార్మికుడిని బయటకు తీయడంలో రెస్క్యూ బృందాలు విజయం సాధించాయని అగ్నిమాపక దళంలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అల్-గారిబ్ ధృవీకరించారు. కానీ, అప్పటికే అతను మరణించాడని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి అగ్నిమాపక బృందాలు, సంబంధిత ఏజెన్సీలతో పాటు, సైట్ కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నాయని అల్-గారిబ్ తెలిపారు.
అల్-రాయ్ పారిశ్రామిక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనంలో ఒక్కసారిగా ల్యాండ్ స్లైడ్ ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. తొలుత ఒక కార్మికుడు మరణించగా, మరొక కార్మికుడు చిక్కుకుపోయాడు. అన్ని శిధిలాలను తొలగించి, సైట్ పూర్తిగా సురక్షితంగా ఉండే వరకు జనరల్ ఫైర్ ఫోర్స్ ఫీల్డ్ ఆపరేషన్లను కొనసాగిస్తుందని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్లో బంగారు బార్స్ ను గెలుచుకున్న భారతీయులు..!!
- బిదియాలో ప్రమాదకరంగా వాగు దాటిన ఇద్దరు అరెస్టు..!!
- లెబనాన్ను వెంటనే విడిచి వెళ్లండి: సౌదీ అరేబియా
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన పీఎం..!!
- దమ్మామ్ నుండి కార్యకలాపాలను పొడిగించిన గల్ఫ్ ఎయిర్..!!
- అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో ఖతార్ ప్రధాన మంత్రి భేటీ..!!
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి









