అల్-రాయ్లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- December 10, 2025
కువైట్: అల్-రాయ్ ప్రాంతంలోని నిర్మాణ స్థలంలో జరిగిన ల్యాండ్ స్లైడ్ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించినట్లు జనరల్ ఫైర్ ఫోర్స్ ప్రకటించింది. గంటల తరబడి తీవ్ర ప్రయత్నాల తర్వాత ఇసుక కింద చిక్కుకున్న రెండవ కార్మికుడిని బయటకు తీయడంలో రెస్క్యూ బృందాలు విజయం సాధించాయని అగ్నిమాపక దళంలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అల్-గారిబ్ ధృవీకరించారు. కానీ, అప్పటికే అతను మరణించాడని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి అగ్నిమాపక బృందాలు, సంబంధిత ఏజెన్సీలతో పాటు, సైట్ కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నాయని అల్-గారిబ్ తెలిపారు.
అల్-రాయ్ పారిశ్రామిక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనంలో ఒక్కసారిగా ల్యాండ్ స్లైడ్ ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. తొలుత ఒక కార్మికుడు మరణించగా, మరొక కార్మికుడు చిక్కుకుపోయాడు. అన్ని శిధిలాలను తొలగించి, సైట్ పూర్తిగా సురక్షితంగా ఉండే వరకు జనరల్ ఫైర్ ఫోర్స్ ఫీల్డ్ ఆపరేషన్లను కొనసాగిస్తుందని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!







