విజయ్‌కాంత్‌ దంపతులపై అరెస్టువారెంట్‌ జారీచేసిన తిరుపూర్‌ ప్రిన్సిపల్‌ న్యాయస్థానం

- July 26, 2016 , by Maagulf
విజయ్‌కాంత్‌ దంపతులపై అరెస్టువారెంట్‌ జారీచేసిన తిరుపూర్‌ ప్రిన్సిపల్‌ న్యాయస్థానం

తమిళనాడులో డీఎండీకే అధినేత, సినీనటుడు విజయ్‌కాంత్‌ దంపతులపై తిరుపూర్‌ ప్రిన్సిపల్‌ న్యాయస్థానం అరెస్టువారెంట్‌ జారీచేసింది. పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరుకానందుకు విజయ్‌కాంత్‌, ఆయన సతీమణి ప్రేమలతకు న్యాయమూర్తి అలమేలు నటరాజన్‌ వారెంట్‌ జారీ చేశారు. గత మూడు విచారణలకు హాజరుకాని విజయ్‌కాంత్‌ మంగళవారం కూడా హాజరుకాకపోవడంతో కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 2015 నవంబర్‌ 6న పల్లడంలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ముఖ్యమంత్రి జయలలితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను పబ్లిక్‌ప్రాసిక్యూటర్‌ కేఎన్‌ సుబ్రహ్మణియం విజయ్‌కాంత్‌ దంపతులపై ఫిర్యాదు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com