మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- December 11, 2025
అమెరికా: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన నిర్వహించారు.ఈ పర్యటనలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ కూడా పాల్గొన్నారు.మోహన్ కృష్ణ వివరించినట్లుగా, లోకేష్ ఉదయం నుంచి రాత్రి వరకు దిగ్గజ కంపెనీల సీఈవోలతో వరుస సమావేశాలు నిర్వహించారు.ఈ పర్యటన ఏపీలో వేల కోట్ల పెట్టుబడులకు పునాదిగా మారబోతోంది.రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించడం, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడడం కోసం లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారు.
యూఎస్ పర్యటనలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్తో సమావేశమై విశాఖలో $15 బిలియన్ డాలర్ల ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్ ప్రారంభంపై చర్చించారు. ఇంటెల్ సంస్థతో అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ (ATMP) యూనిట్ ఏర్పాటు పై చర్చలు జరిగాయి. అంతేకాక, అగ్రగామి సంస్థ ఎన్ విడియా, అడోబ్, జూమ్ సంస్థల ప్రతినిధులతో భేటీ కావడం ద్వారా విశాఖపట్నం, అమరావతి ప్రాంతాల్లో ఆర్ & డి, డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి ప్రేరణ పొందాయి. మోహన్ మోహన్ కృష్ణ తెలిపారు, ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా ఎదగడానికి దోహదం అవుతుంది.
తాజా వార్తలు
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయం పై సీఎం రేవంత్ ని అభినందించిన ఎంపీలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
- వెదర్ అలెర్ట్..ఖతార్ లో భారీ వర్షాలు..!!
- SR324 మిలియన్లతో 2,191 మంది ఉద్యోగార్ధులకు మద్దతు..!!







