10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- December 11, 2025
ప్రపంచవ్యాప్తంగా వేలాది కార్మికులను తొలగించినప్పటికీ.. అమెజాన్ భారత మార్కెట్పై తన నమ్మకాన్ని కోల్పోలేదు. పరిశ్రమలో భారీ లేఆఫ్స్ చేసిన కంపెనీల్లో అమెజాన్ ఒకటని విమర్శలు వచ్చినప్పటికీ.. భారతదేశంలో తన పెట్టుబడులను గణనీయంగా పెంచుతూ ఉంది. ఇప్పటికే దేశానికి 40 బిలియన్ల డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టిన ఈ అమెరికా దిగ్గజం, ఇప్పుడు మరింత దూకుడుతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా న్యూఢిల్లీలో జరిగిన తమ వార్షిక స్మ్భవ్ సమ్మిట్లో అమెజాన్ మరో భారీ ప్రకటన చేసింది. అదనంగా 35 బిలియన్ల డాలర్లు భారతదేశంలో పెట్టుబడి పెట్టి, 2030 నాటికి మరో 10 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించడం తమ ముఖ్య లక్ష్యమని కంపెనీ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పునర్నిర్మాణ చర్యల పేరుతో దాదాపు 14 వేల మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించిన అమెజాన్, తన భవిష్యత్ వృద్ధి కేంద్రంగా భారత మార్కెట్ను స్పష్టంగా నిర్మించుకుంటోంది.
ఇప్పటికే అమెజాన్ భారతదేశంలో నిర్మించిన విస్తృత మౌలిక సదుపాయాలు..ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, డెలివరీ స్టేషన్లు, రవాణా నెట్వర్క్లు, అలాగే AWS క్లౌడ్ మౌలిక వేదిక, అన్నీ దేశీయ డిజిటల్ పర్యావరణ వ్యవస్థకు ముఖ్య ఆధారంగా మారాయి. ఈ భారీ విస్తరణ 2010లో అమెజాన్ భారత మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి క్రమంగా కొనసాగుతోంది. తాజాగా కీస్టోన్ స్ట్రాటజీ విడుదల చేసిన ఆర్థిక ప్రభావ నివేదిక ప్రకారం.. అమెజాన్ ప్రస్తుతం సుమారు 2.8 మిలియన్ ఉద్యోగాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా, కాలానుగుణంగా మద్దతు ఇస్తోంది. భారత్లో అమెజాన్ 37 బిలియన్ డాలర్ల పెట్టుబడి..లక్షల ఉద్యోగాలు ఈ రంగాల్లోనే భారత్లో అమెజాన్ 37 బిలియన్ డాలర్ల పెట్టుబడి.. లక్షల ఉద్యోగాలు ఈ రంగాల్లోనేలక్షలాది మంది భారతీయ చిన్న వ్యాపారాలకు AI సాధనాలను అందించడం, 2030 నాటికి దేశం నుండి జరిగే ఇ-కామర్స్ ఎగుమతులను 80 బిలియన్ల డాలర్లకు పెంచడం, అలాగే ప్రభుత్వ పాఠశాలలలో నాలుగు మిలియన్ మంది విద్యార్థులకు AI ఆధారిత విద్య అందించడం అమెజాన్ యొక్క స్పష్టమైన ప్రాధాన్యతలని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!









