ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- December 11, 2025
దోహా: ఖతార్ లో మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ (MoM) 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలను ప్రారంభించింది. ఇది డిజిటల్ యాక్సెసిబిలిటీని మెరుగుపరచడంతోపాటు ప్రజా విధానాలను క్రమబద్ధీకరించడంలో సహయపడుతుందని తెలిపింది. కొత్త డిజిటల్ వ్యవసాయ సేవలు ఇప్పుడు మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని ప్రకటించారు.
కొత్తగా ప్రవేశపెట్టిన సేవలు వ్యవసాయ కార్యకలాపాలను కవర్ చేస్తాయని మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో ఎరువులు, విత్తనాలు మరియు పురుగుమందుల దిగుమతి, ఎగుమతి, తయారీ మరియు నిర్వహణకు లైసెన్సింగ్, అలాగే వ్యవసాయ ఉత్పత్తులను నమోదు చేయడం మరియు పునరుద్ధరించడం కోసం సేవలు ఉన్నాయని అన్నారు.
ఈ డిజిటల్ సేవలు అనేక కీలక ప్రయోజనాలను అందిస్తాయని, ప్రధానంగా వినియోగదారులు ఎప్పుడైనా మరియు ఏ ప్రదేశం నుండి అయినా సేవలను యాక్సెస్ చేయవచ్చని వెల్లడించింది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్లో బంగారు బార్స్ ను గెలుచుకున్న భారతీయులు..!!
- బిదియాలో ప్రమాదకరంగా వాగు దాటిన ఇద్దరు అరెస్టు..!!
- లెబనాన్ను వెంటనే విడిచి వెళ్లండి: సౌదీ అరేబియా
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన పీఎం..!!
- దమ్మామ్ నుండి కార్యకలాపాలను పొడిగించిన గల్ఫ్ ఎయిర్..!!
- అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో ఖతార్ ప్రధాన మంత్రి భేటీ..!!
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి









