అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ వాహకనౌక ప్రయోగాన్ని వాయిదా

- July 26, 2016 , by Maagulf
అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ వాహకనౌక ప్రయోగాన్ని వాయిదా

నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ధావన్‌ రోదసీ కేంద్రం (షార్‌) నుంచి చేయదలచిన అడ్వాన్స్‌డ్‌టెక్నాలజీ వాహకనౌక (ఏటీవీ) ప్రయోగం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈప్రయోగం గురువారం జరగాల్సిఉండగా లాంచ్‌ విండో అనుమతి(ఏటీసీ) రానందున వాయిదా వేశారు. శుక్రవారం చెన్నై నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరిన వాయుసేనకు చెందిన ఆంటనోవ్‌ (ఏఎన్‌)-32 అదృశ్యమైన విషయం తెలిసిందే. దీని ఆచూకీ తెలుసుకునే పనిలో నౌకాదళం, తీరరక్షక దళానికి చెందిన నౌకలు, ఎనిమిది విమానాలు సముద్రంలో విస్తృతంగా గాలిస్తున్నాయి. ఈనేపథ్యంలో రాకెట్‌ ప్రయోగానికి ఎయిర్‌ ట్రాఫిక్‌ అనుమతి రానందున గురువారం జరగాల్సిన అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ వాహకనౌక ప్రయోగాన్ని వాయిదావేసినట్లు తెలిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com