అయ్యోపాపం ముంగిస
- July 19, 2015
అనగనగా ఒక ఊరిలో ఒక బీద బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ బ్రాహ్మణుడు బీదవాడైనా కానీ వేద శాస్త్రాల్లో పండితుడు. భార్య భర్తననుసరించి ఉన్నంతలో ఇల్లు గడిపే మహా సాధ్వి. ఒకరోజు ఆమె గుమ్మంలో కూర్చోని పని చేసుకుంటుండగా ఎక్కడి నుండో ఒక ముంగిస కాలికి గాయంతో రక్తం కారుతూ గుమ్మం దగ్గరికి వచ్చి పడిపోయింది. ఆ బ్రాహ్మణి దాన్ని చేతిలోకి తీసుకుని దాని గాయానికి కట్టు కట్టి మందు రాసింది. అప్పటి నుండి ఆ ముంగిస ఆ ఇంట్లోనే ఉండిపోయి ఆమెకు తోడుగా ఉండేది. రోజూ ఆమె చేత్తో ఆ ముంగిస తలను ప్రేమతో నిమురుతూ ముద్దులాడేది. దాంతో దానికి ఆమె పట్ల ఆ ఇంటి పట్ల ఎంతో కృతజ్ఞత కలిగింది. కొన్నాళ్లకి బ్రాహ్మణ దంపతులకి ఒక బుజ్జి బాబు పుట్టాడు. ఆ బాబు ఉయ్యాల్లో ఆడుకుంటూంటే ముంగిస ఉయ్యాల పక్కనే కాపలా కాస్తూ ఉండేది. ఒకరోజు ఆ బ్రాహ్మణి కొడుకుని తన భర్తకి అప్పగించి, తాను పొరుగింటికి వెళ్లింది. కొంత సేపయ్యాక ఆ బ్రాహ్మణునితో ఏదో పెళ్లి ముహూర్తం పెట్టించుకోవాలని ఆ ఊరి పెద్ద వచ్చారు. అప్పుడు అతను బాబుని వదిలి గుమ్మం బయట అరుగు మీద పంచాంగం తిరగేస్తూ బాబు సంగతిని మర్చిపోయి ఊరి పెద్దతో మాటాడుతూ ఉండిపోయాడు. ఇంతలో ఎక్కడి నుండో ఒక పాము ఆ ఇంటి చూరిలోంచి ఉయ్యాల చీరను ఆసరాగా చేసుకొని బాబు దగ్గరికి రాసాగింది. అక్కడే ఉన్న ముంగిస అమాంతం దాని మీదకి దూకి అతి కష్టంపై ప్రాణాలకు తెగించి ఆ పాముని చంపేసి, నెత్తురు అంటిన నోటితో అలసిపోయి గుమ్మం దగ్గరగా ఉన్న బ్రాహ్మణుడి వద్దకు రాబోతుండగా, అది చూసిన బ్రాహ్మణుడు ఈ ముంగిస తన బాబుకేదో హాని తలబెట్టిందని పొరపడి అక్కడ ఉన్న కర్రతో దాని తల పగులగొట్టి చంపేశాడు. ఇంతలో లోపలికి వచ్చి చూడగా అక్కడ చచ్చి పడి ఉన్న పామును చూసి జరిగింది గ్రహించి తన భర్త చేసిన పనికి చాలా బాధపడింది. తన తొందరపాటుకు పాపం అన్యాయంగా ముంగిస నా చేతిలో బలైపోయిందే అని మనసులో చాలా బాధపడ్డాడు.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







