టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- December 13, 2025
విశాఖపట్నం: విశాఖపట్నం అందాలను సందర్శించాలని ప్లాన్ చేస్తున్న పర్యాటకులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అద్భుతమైన శుభవార్త అందించింది. 2025 జనవరి నెలాఖరులో విశాఖ తీరం ఒక పండుగ వాతావరణాన్ని సంతరించుకోనుంది.జనవరి 23 నుంచి 31 వరకు మొత్తం తొమ్మిది రోజుల పాటు ‘విశాఖ ఉత్సవ్’ పేరిట బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు.ఈ మెగా ఈవెంట్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి.
శుక్రవారం విశాఖలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(N. Chandrababu Naidu) నాయుడు అధ్యక్షతన జరిగిన ఆర్థిక అభివృద్ధి సమీక్షా సమావేశంలో ఈ ఉత్సవానికి సంబంధించిన అధికారిక పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, పర్యాటక శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పండుగను నిర్వహించనుంది. తొమ్మిది రోజుల పాటు నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్తో పర్యాటకులను మంత్రముగ్ధులను చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఈ ఉత్సవం కేవలం స్థానికులకు మాత్రమే కాకుండా, దేశ విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షించేలా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. విశాఖను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈ అడుగు వేసింది. ఇందులో భాగంగానే విభిన్న రకాల ఆహార పదార్థాలతో కూడిన ఫుడ్ ఫెస్టివల్స్, అబ్బురపరిచే సాంస్కృతిక ప్రదర్శనలు, మరియు సాహస క్రీడలను ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పర్యాటక రంగానికి మరింత ప్రాచుర్యం కల్పించడమే ఈ బీచ్ ఫెస్టివల్ ప్రధాన ఉద్దేశ్యం. ఉత్సవాల నిర్వహణను పర్యవేక్షించేందుకు త్వరలోనే స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించనున్నారు.ఈ కమిటీ ఆధ్వర్యంలో భద్రత, రవాణా మరియు వసతి సౌకర్యాల పై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.విశాఖ ఉత్సవ్ను ఒక అంతర్జాతీయ స్థాయి ఈవెంట్గా మార్చడం ద్వారా రాష్ట్ర పర్యాటక ఆదాయాన్ని పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ









