నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- December 14, 2025
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా హైదరాబాద్లో సర్వ్ నీడి సంస్థతో కలిసి మడ్ఫోర్డ్ మురికివాడ ప్రాంతంలో నిరుపేద బాలలకు అన్నదానం చేసింది.అక్కడే కేక్ కట్ చేసి చిన్నారుల్లో సంతోషాన్ని నింపింది...నిరుపేద పిల్లలకు చక్కటి రుచికరమైన ఆహారాన్ని అందించడంతో పిల్లల్లో ఆనందం ఉప్పొంగింది.తాము చేసిన చిన్న సాయానికి చిన్నారుల మొహాల్లో కనిపించిన ఆనందాన్ని జీవితంలో మరిచిపోలేనని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. సర్వ్ నీడి ద్వారా గౌతమ్ నిరుపేద బాలల కోసం చేస్తున్న సేవలను ప్రశాంత్ ప్రశంసించారు.సర్వ్ నీడ్తో కలిసి మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు తాము సిద్ధంంగా ఉన్నామని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి తెలిపారు.భారతదేశంలో ప్రత్యేక సందర్భాలలో భోజనం దానం చేయాలనుకునే ప్రవాస భారతీయులకు (NRIలకు) 'సర్వ్ నీడి' సంస్థ మంచి వేదికగా నిలుస్తోందని నాట్స్ కార్యనిర్వాహక కమిటీ సభ్యులు కిరణ్ మందాడి అన్నారు. భాషే రమ్యం..సేవే గమ్యం అనే నినాదాన్ని విధానంగా మార్చుకున్న నాట్స్ నిరుపేదలకు సాయం చేసే ఎన్నో సంస్థలకు కలిసి పనిచేస్తుంది.పేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు తన వంతు కృషి చేస్తుంది.
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









