క్షణాల్లో బస్సు పూర్తిగా దగ్ధం
- July 26, 2016
ఇటీవల కాలంలో రహదారులపై ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల బస్సులు మంటల్లో ధగ్ధమవుతున్న సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఎన్ని భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఈ ప్రమాదాలను నిలువరించడంలో విఫలం అవుతున్నాయి. ఇటీవల కాలంలో జరిగిన ఈ సంఘటనల్లో కొంత మంది ప్రాణాలు కోల్పోతే, మరికొంతమంది అప్రమత్తమై తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భంలో ప్రయాణికుల అప్రమత్తమే వారికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు.
ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం వీరేపల్లి వద్ద ఈ తెల్లవారుజామున ఆరు గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్కు చెందిన స్లీపర్ బస్సు ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం మోచెర్ల సమీపంలో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు అద్దాలు పగలగొట్టి బయటపడ్డారు.
. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 23 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులోని ప్రయాణికులంతా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగా, వారి లగేజీ పూర్తిగా దగ్ధమైంది. బస్సు క్లీనర్ వీరేశంకు స్వల్ప గాయాలయ్యాయి. టంగుటూరు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. దీంతో చెన్నై జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. హైవే పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను పునరుద్ధరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







