కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- December 16, 2025
జెడ్డా: 2025 ఏడాదికి సంబంధించి కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (KAIA) 50 మిలియన్ల మంది ప్రయాణీకులకు సేవలు అందించి చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. సౌదీ విమానాశ్రయంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక వార్షిక ప్రయాణీకుల సంఖ్య ఇదేనని అధికారులు తెలిపారు.విమానాశ్రయం కీలకమైన ప్రాంతీయ మరియు అంతర్జాతీయ గేట్వేగా మారడంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు.ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా మరియు రెండు పవిత్ర మసీదులకు ప్రధాన ఎయిర్ గేట్వేగా సౌదీ అరేబియా మారిందని తెలిపారు.
జెడ్డాలో ఒక క్రీడా కార్యక్రమానికి హాజరు కావడానికి సౌదీ విమానంలో పారిస్ నుండి వచ్చిన ఫ్రెంచ్ ప్రయాణీకుడిని జెడ్డాలో విమానాశ్రయం సిబ్బంది 50 మిలియన్ల ప్రయాణీకుడిగా స్వాగతించారు. అనంతరం స్మారక బహుమతిని అందజేసినట్టు జెద్దా విమానాశ్రయాల కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇంజినీర్ మాజెన్ జోహార్ తెలిపారు. 50 మిలియన్ల మంది ప్రయాణికులను చేరుకోవడం విమానాశ్రయం అధిక కార్యాచరణ సంసిద్ధతను తెలియజేస్తుందని పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రయాణీకుల సంఖ్యను రెట్టింపు చేయడం, మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!









