కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- December 16, 2025
జెడ్డా: 2025 ఏడాదికి సంబంధించి కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (KAIA) 50 మిలియన్ల మంది ప్రయాణీకులకు సేవలు అందించి చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. సౌదీ విమానాశ్రయంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక వార్షిక ప్రయాణీకుల సంఖ్య ఇదేనని అధికారులు తెలిపారు.విమానాశ్రయం కీలకమైన ప్రాంతీయ మరియు అంతర్జాతీయ గేట్వేగా మారడంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు.ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా మరియు రెండు పవిత్ర మసీదులకు ప్రధాన ఎయిర్ గేట్వేగా సౌదీ అరేబియా మారిందని తెలిపారు.
జెడ్డాలో ఒక క్రీడా కార్యక్రమానికి హాజరు కావడానికి సౌదీ విమానంలో పారిస్ నుండి వచ్చిన ఫ్రెంచ్ ప్రయాణీకుడిని జెడ్డాలో విమానాశ్రయం సిబ్బంది 50 మిలియన్ల ప్రయాణీకుడిగా స్వాగతించారు. అనంతరం స్మారక బహుమతిని అందజేసినట్టు జెద్దా విమానాశ్రయాల కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇంజినీర్ మాజెన్ జోహార్ తెలిపారు. 50 మిలియన్ల మంది ప్రయాణికులను చేరుకోవడం విమానాశ్రయం అధిక కార్యాచరణ సంసిద్ధతను తెలియజేస్తుందని పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రయాణీకుల సంఖ్యను రెట్టింపు చేయడం, మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







