కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- December 16, 2025
జెడ్డా: 2025 ఏడాదికి సంబంధించి కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (KAIA) 50 మిలియన్ల మంది ప్రయాణీకులకు సేవలు అందించి చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. సౌదీ విమానాశ్రయంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక వార్షిక ప్రయాణీకుల సంఖ్య ఇదేనని అధికారులు తెలిపారు.విమానాశ్రయం కీలకమైన ప్రాంతీయ మరియు అంతర్జాతీయ గేట్వేగా మారడంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు.ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా మరియు రెండు పవిత్ర మసీదులకు ప్రధాన ఎయిర్ గేట్వేగా సౌదీ అరేబియా మారిందని తెలిపారు.
జెడ్డాలో ఒక క్రీడా కార్యక్రమానికి హాజరు కావడానికి సౌదీ విమానంలో పారిస్ నుండి వచ్చిన ఫ్రెంచ్ ప్రయాణీకుడిని జెడ్డాలో విమానాశ్రయం సిబ్బంది 50 మిలియన్ల ప్రయాణీకుడిగా స్వాగతించారు. అనంతరం స్మారక బహుమతిని అందజేసినట్టు జెద్దా విమానాశ్రయాల కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇంజినీర్ మాజెన్ జోహార్ తెలిపారు. 50 మిలియన్ల మంది ప్రయాణికులను చేరుకోవడం విమానాశ్రయం అధిక కార్యాచరణ సంసిద్ధతను తెలియజేస్తుందని పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రయాణీకుల సంఖ్యను రెట్టింపు చేయడం, మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









