సౌదీ అరేబియాలో భూకంపం.. యూఏఈలో ప్రభావమెంతంటే?
- December 17, 2025
యూఏఈ: సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్లో ఈరోజు తెల్లవారుజామున 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) తెలిపింది. ఈ భూకంపం స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2.11 గంటలకు వచ్చింది. భూకంప కేంద్రం 50 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొన్నారు.
కాగా, ఈ భూకంపం యూఏఈపై ఎలాంటి ప్రభావం చూపలేదని మరియు ఎమిరేట్స్లోని నివాసితులకు ఇది అనుభూతిలోకి రాలేదని స్పష్టం చేసింది.
గల్ఫ్ దేశంలో చివరిసారిగా భూకంపం ఈ ఏదాది ఏప్రిల్లో సంభవించింది. అప్పుడు యూఏఈ - సౌదీ అరేబియాలో దీని ప్రభావం కనిపించింది. అరేబియా సముద్రంలో, ఆ రాజ్య సరిహద్దులకు సమీపంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు గుర్తించారు. ఆ భూకంపానికి కారణం అరేబియా ప్లేట్ కదలిక అని, అది యురేషియన్ ప్లేట్తో ఢీకొనడం వల్ల అరేబియా గల్ఫ్ ప్రాంతంలోని తరచూ స్వల్ప స్థాయిలో భూకంపాలు వస్తుంటాయని నిపుణులు తెలిపారు.
ఇరాన్, ఇరాక్ మరియు ఒమన్ వంటి పొరుగు దేశాలలో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. కొన్నిసార్లు వాటి ప్రభావం యూఏఈలో కనిపిస్తాయి. నవంబర్ 4న, ముసందమ్ దక్షిణాన 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఎమిరేట్స్లో కూడా ప్రకంపనలను గమనించారు ప్రజలు.
తాజా వార్తలు
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!









