సౌదీ అరేబియాలో భూకంపం.. యూఏఈలో ప్రభావమెంతంటే?
- December 17, 2025
యూఏఈ: సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్లో ఈరోజు తెల్లవారుజామున 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) తెలిపింది. ఈ భూకంపం స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2.11 గంటలకు వచ్చింది. భూకంప కేంద్రం 50 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొన్నారు.
కాగా, ఈ భూకంపం యూఏఈపై ఎలాంటి ప్రభావం చూపలేదని మరియు ఎమిరేట్స్లోని నివాసితులకు ఇది అనుభూతిలోకి రాలేదని స్పష్టం చేసింది.
గల్ఫ్ దేశంలో చివరిసారిగా భూకంపం ఈ ఏదాది ఏప్రిల్లో సంభవించింది. అప్పుడు యూఏఈ - సౌదీ అరేబియాలో దీని ప్రభావం కనిపించింది. అరేబియా సముద్రంలో, ఆ రాజ్య సరిహద్దులకు సమీపంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు గుర్తించారు. ఆ భూకంపానికి కారణం అరేబియా ప్లేట్ కదలిక అని, అది యురేషియన్ ప్లేట్తో ఢీకొనడం వల్ల అరేబియా గల్ఫ్ ప్రాంతంలోని తరచూ స్వల్ప స్థాయిలో భూకంపాలు వస్తుంటాయని నిపుణులు తెలిపారు.
ఇరాన్, ఇరాక్ మరియు ఒమన్ వంటి పొరుగు దేశాలలో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. కొన్నిసార్లు వాటి ప్రభావం యూఏఈలో కనిపిస్తాయి. నవంబర్ 4న, ముసందమ్ దక్షిణాన 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఎమిరేట్స్లో కూడా ప్రకంపనలను గమనించారు ప్రజలు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









