శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి
- December 17, 2025
హైదరాబాద్: శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేటలో ఉన్న ఎయిర్ఫోర్స్ శిక్షణ కేంద్రానికి ఆమె ప్రత్యేక విమానంలో రాగా, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్బాబు, సీతక్క తదితర ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ నెల 18న ఆమె అధికారిక నివాసంలో విశ్రాంతి తీసుకోనున్నారు.19వ తేదీన రామోజీ ఫిల్మ్సిటీలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 20న గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతిసరోవర్ సంస్థ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతారు.
21న నివాసంలో ఏర్పాటు చేసే పౌరుల భేటీతో పాటు’ఎట్ హోమ్’కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 22వ తేదీ సాయంత్రం ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి ప్రయాణం కానున్నారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!
- ఒమన్ లో జువైనల్ నేరాల పెరుగుదలపై ఆందోళన..!!
- ఆన్లైన్లో మైనర్ బాలికకు వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!









