మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- December 18, 2025
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్–2025 ఫైనల్ పోటీల్లో విద్యా సంపత్ విజేతగా నిలిచి, భారత్కు తొలి మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ గ్రాండ్ కిరీటం అందించారు. మంగళూరుకు చెందిన విద్య ముంబయిలో పుట్టి పెరిగారు. ఈ పోటీల్లో జాతీయ పక్షి నెమలి, జాతీయ ప్రాణి పులి, జాతీయ పుష్పాన్ని పోలిన వస్త్రాలను ధరించి అందరి దృష్టినీ ఆకర్షించారు. 22 దేశాలకు చెందిన ప్రతిభావంతమైన అందాల భామలతో పోటీపడి ఈ ఘనత సాధించడం విశేషంగా నిలిచింది.
ఇంతకుముందు మిసెస్ ఇండియా ఆస్ట్రల్ కర్ణాటక రన్నరప్ టైటిల్ను గెలుచుకున్న విద్య , ప్రస్తుతం మంగళూరులోని చిత్రాపుర్లో ఒక సూపర్మార్కెట్ను నిర్వహిస్తున్నారు. ఒక వైపు విజయవంతమైన వ్యాపారవేత్తగా, మరో వైపు మోడల్గా ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. చిన్నప్పటినుంచే, కళలు, సంస్కృతి, సామాజిక సేవలపై ప్రత్యేక ఆసక్తి కలిగిన విద్య, వివాహం తర్వాత కూడా తన కలలను వదలకుండా ముందుకు సాగారు. మహిళలు కుటుంబ బాధ్యతలతో పాటు తమ లక్ష్యాలను కూడా సాధించవచ్చని నిరూపించారు.
తాజా వార్తలు
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!
- ఫ్రెండ్ షిప్ కథను తెలిపే ఇండియన్ మానుమెంట్..!!







