కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- December 23, 2025
కువైట్: భారత్ -కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యం యొక్క మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్ క్యాంపెయిన్ ను ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని కువైట్లోని భారత రాయబారి పరమిత త్రిపాఠి, కువైట్ టూరిస్టిక్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ (TEC) CEO అన్వర్ అబ్దుల్లా అల్-హులైలాతో కలిసి ఐకానిక్ కువైట్ టవర్స్ లో ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కువైట్ మరియు ట్రావెల్ ఏజెన్సీలు, టూర్ ఆపరేటర్లు మరియు ఇండియన్ కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు.
నెల రోజుల పాటు జరిగే ఈ ప్రచారంలో భాగంగా, భారత్ లోని వైవిధ్యమైన పర్యాటక ప్రదేశాల గురించి వివరిస్తారు. కువైట్ అంతటా ప్రయాణించే 20 ప్రమోషనల్ బస్సులను రాయబారి త్రిపాఠి జెండా ఊపి ప్రారంభించారు.2024 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన 'మదర్ ఫర్ మదర్ (ఏక్ పెడ్ మా కే నామ్)' చొరవలో భాగంగా రాయబారి త్రిపాఠి కువైట్ టవర్స్లో వేప మొక్కను నాటారు.
ఇండియా పర్యాటక రంగంలో బలమైన వృద్ధిని కొనసాగిస్తోంది.దాదాపు 3 బిలియన్ దేశీయ పర్యాటకుల సందర్శనలతో పాటు, 2024లో దాదాపు 20.94 మిలియన్ల విదేశీ పర్యాటకులు భారత్ ను సందర్శించారు. పర్యాటక రంగం భారత GDPకి దాదాపు 5.2 శాతం మొత్తాన్ని కంట్రిబ్యూట్ చేస్తుంది. అదే సమయంలో మిలియన్ల ఉద్యోగాలను సృష్టిస్తోంది.
ఈ ప్రచారంలో భాగంగా #IncredibleIndia అనే హ్యాష్ట్యాగ్ను ఉపయోగించి, కువైట్లోని భారత రాయబార కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఇంక్రెడిబుల్ ఇండియా బస్సుల ఫోటోలను పోస్ట్ చేసే పాల్గొనేవారి కోసం ఒక లక్కీ డ్రా కూడా నిర్వహించబడుతుంది.
తాజా వార్తలు
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!









