స్వల్పంగా తగ్గిన పసిడి ధర

- July 27, 2016 , by Maagulf
స్వల్పంగా తగ్గిన పసిడి ధర

ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ లేకపోవడంతో బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది. రూ. 140 తగ్గడంతో దేశీయ మార్కెట్లో పది గ్రాముల పసిడి రూ. 30,650గా ఉంది. అంతర్జాతీయంగా కూడా 0.3 శాతం తగ్గి సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,315.93 డాలర్లుగా ఉంది. మరోవైపు వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. బులియన్‌ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 46,200గా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com