తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- December 27, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.నేరాలు, రౌడీయిజం, అక్రమ కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు వంటి అత్యాధునిక సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించి నేరాలను ముందుగానే అరికట్టాలని సూచించారు. నేరస్తుల కంటే పోలీసులు ఎప్పుడూ ఒక అడుగు ముందుండాలని, విజువల్ ఆధారాలతో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అన్నారు. రాజకీయ ముసుగులో బెదిరింపులు, సెటిల్మెంట్లు, రౌడీయిజానికి పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ వంటి నిర్ణయాలకూ వెనుకాడబోమని స్పష్టం చేశారు.
తిరుపతిలో నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని హోంమంత్రి అనితతో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు. తిరుమల పవిత్రతను కాపాడుతూ, దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు సంపూర్ణ భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తిరుపతి ప్రాంతంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణలో పోలీసులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో, నిందితులపై పీడీ యాక్టులు ప్రయోగించడంలో చూపుతున్న చొరవను కొనియాడారు.
గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు దెబ్బతిన్నాయని సీఎం చంద్రబాబు() విమర్శించారు. రోడ్లు బ్లాక్ చేయడం, హింసాత్మక ఘటనలకు పాల్పడే సంస్కృతిని పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. గతంలో జరిగిన అవాంఛనీయ ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా టెక్నాలజీని సమర్థంగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు. డ్రోన్లతో పెట్రోలింగ్, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పోలీసుల ఉనికి కనిపిస్తూ, మరోవైపు నేరస్తులకు తెలియకుండా గట్టి నిఘా ఉండేలా వ్యవస్థను రూపొందించాలని పిలుపునిచ్చారు. చట్టానికి అతీతంగా వ్యవహరిస్తే సొంత పార్టీ వారైనా జైలుకు పంపే సంస్కృతి తమదేనని మరోసారి గుర్తుచేశారు.
తాజా వార్తలు
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఖతార్ లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన వృద్ధి..!!
- అరబ్ దేశాలలో రైస్ వినియోగంలో అట్టడుగు స్థానంలో బహ్రెయిన్..!!
- 2025లో కువైట్ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు..!!
- సౌదీ అరేబియాలో నమోదైన అత్యల్ప వింటర్ ఉష్ణోగ్రతలు..!!
- షార్జాలో గుండెపోటుతో 17 ఏళ్ల ఇండియన్ విద్యార్థిని మృతి..!!
- ఒమన్లో విధ్వంసం, ఆస్తి నష్టం కేసులో కార్మికులు అరెస్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!







