కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- December 27, 2025
యూఏఈ: కత్తితో దాడికి పాల్పడ్డ ఆరుగురు ఆసియన్లకు రస్ అల్ ఖైమా మొదటి మిస్డిమీనర్ క్రిమినల్ కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తియిన తర్వాత వారిని బహిష్కరించాలని ఆదేశించింది.
మొదటి నిందితుడు కత్తితో బాధితుడి ఇంటిపై దాడి చేసిన తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది. బాధితుడిని మూడుసార్లు కొట్టాడని, దీనివల్ల తీవ్ర గాయాలు ఏర్పడినట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు. అయితే, ప్రధాన నిందితుడికి బాధితుడికి హాని కలిగించే ఉద్దేశ్యం లేదని కోర్టు గుర్తించినప్పటికీ, దాడి తీవ్రత నేపథ్యంలో శిక్షకు అర్హమైనదని తీర్పు చెప్పింది. రెండు నుండి తొమ్మిది మంది నిందితులు దాడికి సహాయం చేశారని ఆరోపించారు. వారు మొదటి నిందితుడితో పాటు బాధితుడి నివాసానికి వెళ్లారని, దాడి సమయంలో మద్దతు అందించారని, దాడిలో బాధితుడికి శాశ్వత వైకల్యం ఏర్పడిందని కోర్టు తన తీర్పులో వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!









