లుసైల్ బౌలేవార్డ్ ‘అల్-మజ్లిస్’ డిసెంబర్ 31 టిక్కెట్లు విడుదల..!!
- December 28, 2025
దోహా: లుసైల్ బౌలేవార్డ్ ‘అల్-మజ్లిస్’ డిసెంబర్ 31 వేడుకల కోసం టిక్కెట్లు ఇప్పుడు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఖతార్లోని అత్యంత ప్రముఖ గమ్యస్థానాలలో ఇది ఒక్కటి. ఈ కార్యక్రమంలో ఫైర్ వర్క్, డ్రోన్ మరియు లైట్ షోలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ఈ వేడుక లుసైల్ బౌలేవార్డ్ – అల్ మజ్లిస్లో జరుగుతుంది. ఇది టిక్కెట్లు ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పించే ఒక ప్రైవేట్ వేదిక. టిక్కెట్లు ఉన్నవారికి మాత్రమే ప్రత్యేకంగా ప్రైవేట్ పార్కింగ్ అందుబాటులో ఉంటుంది.
టిక్కెట్లు “మజ్లిస్” కేటగిరీ కింద పెద్దలకు QR300, 6 నుండి 12 సంవత్సరాల పిల్లలకు QR150 ధర నిర్ణయించారు. చబడింది, అయితే ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ప్రవేశం ఉచితం. అలాగే, టిక్కెట్లు ఇప్పుడు వర్జిన్ మెగా స్టోర్ ద్వారా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..







