ఒమన్లో 17.3 శాతం పెరిగిన రియల్ ఇండెక్స్..!!
- December 28, 2025
మస్కట్: ఒమన్ సుల్తానేట్లో రియల్ ఎస్టేట్ ధరల సూచీ 2025 మూడవ త్రైమాసికంలో 17.3 శాతం పెరుగుదలను నమోదు చేసింది.నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) విడుదల చేసిన డేటా ప్రకారం, వాణిజ్య భూముల ధరలలో 19 శాతం పెరుగుదల కారణంగా వాణిజ్య రియల్ ఎస్టేట్ ధరల సూచీ 14.6 శాతం పెరిగింది. అయితే రిటైల్ దుకాణాల ధరలు 8.5 శాతం తగ్గగా.. పారిశ్రామిక భూముల ధరలు 5.5 శాతం పెరిగాయి. ఇక రెసిడెన్సీ ఆస్తుల ధరల సూచీ 2025 మూడవ త్రైమాసికంలో 18.7 శాతంగా ఉంది. నివాస భూముల ధరలు 19.6 శాతం, నివాస అపార్ట్మెంట్ల ధరలు 22.4 శాతం పెరిగాయి. విల్లాల ధరలు 16.5 శాతం పెరిగగా, అయితే ఇతర ఇళ్ల ధరలు 0.5 శాతం తగ్గాయి.
ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో నివాస భూముల ధరలలో మస్కట్ గవర్నరేట్ అత్యధికంగా 48.3 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. ఆ తర్వాత ముసందమ్ గవర్నరేట్ 29.7 శాతం, అల్ దఖిలియా గవర్నరేట్ 12.3 శాతం, సౌత్ అల్ బతినా గవర్నరేట్ 8.7 శాతం, నార్త్ అల్ బతినా గవర్నరేట్ 8.1 శాతం వృద్ధిని నమోదు చేయగా, ధోఫర్ గవర్నరేట్ 4 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అదే సమయంలో కొన్ని గవర్నరేట్లలో నివాస భూముల ధరలు తగ్గుముఖం పట్టాయి. అల్ ధాహిరా గవర్నరేట్లో 25.8 శాతం, అల్ బురైమి గవర్నరేట్లో 24.6 శాతం, అల్ వుస్తా గవర్నరేట్లో 13.3 శాతం, నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లో 4 శాతం, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లో 2.2 శాతం తగ్గుదల నమోదైంది.
తాజా వార్తలు
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!









