హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- December 31, 2025
దోహా: 2025లో ఖతార్ పర్యాటక రంగం ఘనంగా ముగిస్తుంది. హోటల్ రూమ్స్ బుకింగ్ రికార్డు స్థాయిలో 9.7 మిలియన్లకు చేరుకున్నాయి. 2025 చివరి రోజు సందర్శకుల సంఖ్య దేశ చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకుంటుందని భావిస్తున్నట్లు ఖతార్ ఛాంబర్లోని పర్యాటక మరియు ప్రదర్శనల కమిటీ సభ్యుడు అయమాన్ అల్ ఖుద్వా తెలిపారు.
జనవరి మరియు నవంబర్ మధ్య సందర్శకుల రాక సుమారు 4.4 మిలియన్లకు చేరుకుందని, డిసెంబర్ లెక్కలు ఇంకా అధికారికంగా విడుదల కావాల్సి ఉందని పేర్కొన్నారు. విజిటర్స్ సంఖ్య మరియు హోటల్ ఆక్యుపెన్సీ పరంగా 2025 సంవత్సరం గతంలోని అన్ని రికార్డులను అధిగమిస్తుందని అల్ ఖుద్వా అన్నారు.
ఈ ఏడాది ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్, ఫిఫా అరబ్ కప్ మరియు అనేక రకాల స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఖతార్ వేదికగా జరిగాయని తెలిపారు. ఏటా ఖతార్ ను సందర్శించే విజిటర్స్ సంఖ్య సరికొత్త రికార్డులను నమోదు చేస్తుందని అయమాన్ అల్ ఖుద్వా వెల్లడించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









