హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- December 31, 2025
దోహా: 2025లో ఖతార్ పర్యాటక రంగం ఘనంగా ముగిస్తుంది. హోటల్ రూమ్స్ బుకింగ్ రికార్డు స్థాయిలో 9.7 మిలియన్లకు చేరుకున్నాయి. 2025 చివరి రోజు సందర్శకుల సంఖ్య దేశ చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకుంటుందని భావిస్తున్నట్లు ఖతార్ ఛాంబర్లోని పర్యాటక మరియు ప్రదర్శనల కమిటీ సభ్యుడు అయమాన్ అల్ ఖుద్వా తెలిపారు.
జనవరి మరియు నవంబర్ మధ్య సందర్శకుల రాక సుమారు 4.4 మిలియన్లకు చేరుకుందని, డిసెంబర్ లెక్కలు ఇంకా అధికారికంగా విడుదల కావాల్సి ఉందని పేర్కొన్నారు. విజిటర్స్ సంఖ్య మరియు హోటల్ ఆక్యుపెన్సీ పరంగా 2025 సంవత్సరం గతంలోని అన్ని రికార్డులను అధిగమిస్తుందని అల్ ఖుద్వా అన్నారు.
ఈ ఏడాది ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్, ఫిఫా అరబ్ కప్ మరియు అనేక రకాల స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఖతార్ వేదికగా జరిగాయని తెలిపారు. ఏటా ఖతార్ ను సందర్శించే విజిటర్స్ సంఖ్య సరికొత్త రికార్డులను నమోదు చేస్తుందని అయమాన్ అల్ ఖుద్వా వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









