కనకదుర్గమ్మ ఆలయంలో కలకలం..పూజ పాలలో పురుగులు
- January 11, 2026
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లోని బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో మరోసారి వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. శ్రీచక్ర నవావరణార్చన వంటి అత్యంత పవిత్రమైన పూజకు వినియోగించిన పాలలో పురుగులు కనిపించడంతో భక్తుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అమ్మవారి సన్నిధిలో నిర్వహించే పూజల్లో నాణ్యత, పరిశుభ్రతపై ఇప్పటికే ప్రశ్నలు వస్తున్న వేళ, ఈ ఘటన ఆలయ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చేలా మారింది.
శుక్రవారం అమ్మవారి నూతన పూజా మండపంలో ఈ ఘటన జరగగా, శనివారం విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఆవుపాలు ఉపయోగించాల్సిన పూజలో పురుగులు ఉన్న టెట్రా ప్యాకెట్ పాలను వాడినట్లు సమాచారం. ఈ విషయం గుర్తించిన అర్చకులు వెంటనే పూజను నిలిపివేయగా, దాదాపు అరగంట పాటు నవావరణార్చన నిలిచిపోయింది. ఆలయ నిర్వహణలో నిర్లక్ష్యం ఉందని భక్తులు విమర్శలు చేస్తున్నారు. ఆలయంలో పవిత్రత, సంప్రదాయాలకు భంగం కలిగే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









