NDWBFలో ఖతార్.. భారత్ తో బలమైన సంబంధాలు..!!
- January 11, 2026
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ పుస్తక ప్రదర్శనలో గౌరవ అతిథిగా ఖతార్ సంస్కృతి శాఖ మంత్రి షేక్ అబ్దుల్ రెహమాన్ బిన్ హమద్ అల్-థానీ పాల్గొన్నారు.సంస్కృతి మరియు విజ్ఞానం మానవ సంబంధాలకు వారధులుగా ఖతార్, భారత్ ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భారత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తోపాటు స్పెయిన్ సంస్కృతి శాఖ మంత్రి ఎర్నెస్ట్ ఉర్టాసున్,భారత్ లో ఖతార్ రాయబారి మహమ్మద్ హసన్ అల్ జాబిర్, సంస్కృతి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ ఘనేమ్ బిన్ ముబారక్ అల్ అలీ, అలాగే పలువురు అధికారులు, దౌత్యవేత్తలు పాల్గొన్నారు.
ఈ అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమంలో గౌరవ అతిథిగా ఉండటం పట్ల ఖతార్ గర్విస్తోందని షేక్ అబ్దుల్ రెహమాన్ బిన్ హమద్ అల్-థానీ అన్నారు. రెండు దేశాల నాగరికతలను నిర్మించడంలో పుస్తకాలు పోషించే కీలక పాత్రను న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శన ప్రతిబింబిస్తుందని అన్నారు.తనకు లభించిన ఆత్మీయ స్వాగతానికి మరియు మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!









