NDWBFలో ఖతార్.. భారత్ తో బలమైన సంబంధాలు..!!
- January 11, 2026
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ పుస్తక ప్రదర్శనలో గౌరవ అతిథిగా ఖతార్ సంస్కృతి శాఖ మంత్రి షేక్ అబ్దుల్ రెహమాన్ బిన్ హమద్ అల్-థానీ పాల్గొన్నారు.సంస్కృతి మరియు విజ్ఞానం మానవ సంబంధాలకు వారధులుగా ఖతార్, భారత్ ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భారత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తోపాటు స్పెయిన్ సంస్కృతి శాఖ మంత్రి ఎర్నెస్ట్ ఉర్టాసున్,భారత్ లో ఖతార్ రాయబారి మహమ్మద్ హసన్ అల్ జాబిర్, సంస్కృతి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ ఘనేమ్ బిన్ ముబారక్ అల్ అలీ, అలాగే పలువురు అధికారులు, దౌత్యవేత్తలు పాల్గొన్నారు.
ఈ అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమంలో గౌరవ అతిథిగా ఉండటం పట్ల ఖతార్ గర్విస్తోందని షేక్ అబ్దుల్ రెహమాన్ బిన్ హమద్ అల్-థానీ అన్నారు. రెండు దేశాల నాగరికతలను నిర్మించడంలో పుస్తకాలు పోషించే కీలక పాత్రను న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శన ప్రతిబింబిస్తుందని అన్నారు.తనకు లభించిన ఆత్మీయ స్వాగతానికి మరియు మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- కువైట్లో ట్రాఫిక్ మార్పులు: ఐదవ రింగ్ రోడ్డుపై 14 రోజుల పాటు లేన్లు మూసివేత
- NTPCలో 250 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
- దుబాయ్లో ప్రాపర్టీ ఇన్వెస్టర్లకు రెండు సంవత్సరాల రెసిడెన్సీ వీసా నిబంధనల్లో మార్పులు
- మేలో బ్యాంక్ హాలిడేస్ ఫుల్ లిస్ట్..!
- దక్షిణ సూడాన్ రాజధాని శివార్లలో విమానం కూలి 14 మంది మృతి
- ఎగ్జిట్ పోల్స్ కౌంట్డౌన్ షురూ.. మే 4న తుది ఫలితాలు
- పర్యాటకానికి కొత్త కళ..హైదరాబాద్లో భారీ కార్నివాల్ నిర్వహణ
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఎప్పుడొస్తాయి? పేరెంట్స్ లో ఆందోళనలు..!!
- బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ నేతృత్వం..!!
- 77 శాతానికి కార్మికులలో ప్రమాద అవగాహన..!!









