NDWBFలో ఖతార్.. భారత్ తో బలమైన సంబంధాలు..!!

- January 11, 2026 , by Maagulf
NDWBFలో ఖతార్.. భారత్ తో బలమైన సంబంధాలు..!!

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ పుస్తక ప్రదర్శనలో గౌరవ అతిథిగా ఖతార్ సంస్కృతి శాఖ మంత్రి షేక్ అబ్దుల్ రెహమాన్ బిన్ హమద్ అల్-థానీ పాల్గొన్నారు.సంస్కృతి మరియు విజ్ఞానం మానవ సంబంధాలకు వారధులుగా ఖతార్, భారత్ ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భారత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తోపాటు స్పెయిన్ సంస్కృతి శాఖ మంత్రి ఎర్నెస్ట్ ఉర్టాసున్,భారత్ లో ఖతార్ రాయబారి మహమ్మద్ హసన్ అల్ జాబిర్, సంస్కృతి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ ఘనేమ్ బిన్ ముబారక్ అల్ అలీ, అలాగే పలువురు అధికారులు, దౌత్యవేత్తలు పాల్గొన్నారు.

ఈ అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమంలో గౌరవ అతిథిగా ఉండటం పట్ల ఖతార్ గర్విస్తోందని షేక్ అబ్దుల్ రెహమాన్ బిన్ హమద్ అల్-థానీ అన్నారు. రెండు దేశాల నాగరికతలను నిర్మించడంలో పుస్తకాలు పోషించే కీలక పాత్రను న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శన ప్రతిబింబిస్తుందని అన్నారు.తనకు లభించిన ఆత్మీయ స్వాగతానికి మరియు మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com