ఖతార్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారి వినూత్న ప్రచారం
- July 20, 2015
ఈద్-ఉల్-ఫితర్ మూడురోజుల పర్వదినం సందర్భంగా, ఖతార్ ట్రాఫిక్ శాఖ వారు వాహన వినియోగదారులకు, ముఖ్యంగా పార్కింగు విధానం విషయంలో సున్నితంగా జారీచేసిన హెచ్చరికలు అందరి మన్ననలందుకున్నాయి. ఆస్తవ్యస్తo గా లేదా గుర్తింపులేని ప్రాంతాలలో పార్కింగ్ చేసినవారి వాహనాలపై - "ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, నాగరిక లక్షణం. మీ వాహనం ఉల్లంఘిత ప్రాంతంలో ఉంది. గమనించవలెను. మీకు ఈద్ శుభాకాంక్షలు" అని ఉన్న స్టిక్కర్లను అంటించారు. అంతేకాకుండా వారికి 15,000 ఈద్ గ్రీటింగులను కూడా పంచిపెట్టారు. ఈ శాఖ డైరక్టర్ - బ్రిగడియర్ మొహమ్మద్ సాద్ అల్-ఖర్జీ, నిబంధనలు అతిక్రమించిన వారి వద్దనుండి జరిమానా వసూలు చేయడం తమ ఉద్దేశం కాదని, వారు ట్రాఫిక్ నియమనిబంధనలు పాటించడం ద్వారా, వారికి ఇంకా ఇతరులకు కూడా భద్రత కల్పించడం తమ లక్ష్యమని తెలిపారు. తమ ఈ వినూత్న ప్రయోగానికి, ప్రజలు, వాహనదారుల నుండి సానుకూల ప్రశంసలు రావడం ఆనందంగా ఉందన్నారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







