ఖతార్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారి వినూత్న ప్రచారం
- July 20, 2015
ఈద్-ఉల్-ఫితర్ మూడురోజుల పర్వదినం సందర్భంగా, ఖతార్ ట్రాఫిక్ శాఖ వారు వాహన వినియోగదారులకు, ముఖ్యంగా పార్కింగు విధానం విషయంలో సున్నితంగా జారీచేసిన హెచ్చరికలు అందరి మన్ననలందుకున్నాయి. ఆస్తవ్యస్తo గా లేదా గుర్తింపులేని ప్రాంతాలలో పార్కింగ్ చేసినవారి వాహనాలపై - "ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, నాగరిక లక్షణం. మీ వాహనం ఉల్లంఘిత ప్రాంతంలో ఉంది. గమనించవలెను. మీకు ఈద్ శుభాకాంక్షలు" అని ఉన్న స్టిక్కర్లను అంటించారు. అంతేకాకుండా వారికి 15,000 ఈద్ గ్రీటింగులను కూడా పంచిపెట్టారు. ఈ శాఖ డైరక్టర్ - బ్రిగడియర్ మొహమ్మద్ సాద్ అల్-ఖర్జీ, నిబంధనలు అతిక్రమించిన వారి వద్దనుండి జరిమానా వసూలు చేయడం తమ ఉద్దేశం కాదని, వారు ట్రాఫిక్ నియమనిబంధనలు పాటించడం ద్వారా, వారికి ఇంకా ఇతరులకు కూడా భద్రత కల్పించడం తమ లక్ష్యమని తెలిపారు. తమ ఈ వినూత్న ప్రయోగానికి, ప్రజలు, వాహనదారుల నుండి సానుకూల ప్రశంసలు రావడం ఆనందంగా ఉందన్నారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









