త్వరలో బహ్రెయిన్ లోని పురాతన భవనాలపై సర్వే
- July 20, 2015
మనామా లోనున్న పురాతన భవనాలు కూలిపోయి, ప్రజలకు హానిని కలిగించకుండా చర్యలు తీసుకోవడానికి సర్వే చేపట్టనున్నారు. ఇక్కడి అల్ జరీయా హోటల్ బాల్కనీ యొక్క 6వ అంతస్తు బాల్కనీ నుండి ఈ శనివారం సిమెంటు పెళ్లలు రాలిపడిన సందర్భంలో, కాపిటల్ ట్రస్టీస్ బోర్డు అధ్యక్షులు - మజెన్ ఆలుమ్రాన్ మాట్లాడుతూ, తాము ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఇంజనీర్లు, వాలంటీర్లు కలసి అన్ని పాత ఇళ్లను, భవనాలను, దుఖానాలను మరియు హోటళ్లను గురించిన సమాచారాన్ని సేకరించడం ఇప్పుడు అత్యావశ్యాకమని, అనంతరం తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని ఆయన వివరించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







