శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- January 14, 2026
శబరిమల: శబరిమలలో అయ్యప్ప స్వామి భక్తులకు అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మికంగా ఉత్కంఠభరితమైన ఘట్టం ఆవిష్కృతం అయింది. ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు మాదిరిగానే బుధవారం మకర జ్యోతి దర్శనం ఇచ్చింది.సాయంత్రం ఆకాశంలో కనిపించే దివ్యజ్యోతిని భక్తులు సాక్షాత్తు అయ్యప్ప స్వామి ఆశీర్వాద రూపంగా భావిస్తారు. ఈ దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు శబరిమలకు తరలివచ్చారు.
దివ్య జ్యోతిని దర్శించుకున్న భక్తుల స్వామియే శరణమయ్యప్ప శరణుఘోషతో కొండలు మారుమోగాయి. 3838 ఎత్తుల అడుగులో వెలిగిన మకర జ్యోతి.. మూడు సార్లు భక్తులకు దర్శనం ఇచ్చింది. జనవరి 19వ తేదీన అయ్యప్ప స్వామి మూలవిరాట్ కి ఆభరణాలతో అలంకరించి దర్శనం కల్పిస్తారు. 20న స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం మూసివేస్తారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







