కేఏ పాల్కు అమెరికాలో అరుదైన గౌరవం..
- January 17, 2026
అమెరికా: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్కు అమెరికాలోని కాన్సాస్లో అరుదైన గౌరవం దక్కింది. కాన్సాస్ రాష్ట్ర సెనేట్ సభ్యులను ఆశీర్వదించి ప్రసంగించారు కేఏ పాల్.
ప్రపంచంలో జరుగుతున్న 58 యుద్ధాలను ఆపాలంటూ అమెరికా నాయకులకు కేఏ పాల్ పిలుపునిచ్చారు. వెనెజువెలా, యుక్రెయిన్, గాజా, ఇజ్రాయెల్, ఇరాన్లో శాంతి కోసం ప్రార్థనలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రపంచంలో అత్యధిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దేశంగా అమెరికాను ప్రశంసించారు. చైనా, రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్ ముప్పును ఎదుర్కొనేందుకు భారత్-అమెరికా కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.
అఫ్ఘానిస్థాన్, ఇరాన్ యుద్ధాలు అమెరికాకు నష్టం కలిగించాయని డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల నేతలు అంగీకరించారు. అంతకుముందు రిపబ్లికన్, డెమోక్రట్ నేతలు నిలబడి చప్పట్లతో కేఏ పాల్కు స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- BRICS వాణిజ్య మంత్రుల సమావేశంలో యూఏఈ..
- హార్ముజ్ జలసంధిలో యూఏఈ ట్యాంకర్పై ఇరాన్ దాడిని జీసీసీ తీవ్రంగా ఖండించింది
- హార్ముజ్ జలసంధిలో యూఏఈ చమురు ట్యాంకర్పై క్షిపణి దాడి..బహ్రెయిన్ తీవ్ర ఖండన
- హోర్ముజ్ జలసంధిలో అడ్నాక్ నౌకపై క్షిపణి దాడి..సిబ్బంది సురక్షితం
- దుబాయ్లో 290 కి.మీ. వేగంతో బైక్ పై స్టంట్లు.. రైడర్ షాక్..!!
- సౌదీలో 911 ఎమర్జెన్సీ నంబర్కు 2.7మిలియన్ కాల్స్..!!
- క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్..ప్రపంచంలో మూడో స్థానంలో ఒమన్..!!
- కింగ్ ఫహద్ రోడ్డులో వారం రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- నిర్మాణ పనుల శబ్దాలతో ఇబ్బందులు.. తెరపైకి కొత్త ప్రతిపాదన..!!
- ఖతార్లో సమ్మర్ సందడి.. కుటుంబాలతో ఎంజాయ్మెంట్కు స్వాగతం..!!







