కేఏ పాల్కు అమెరికాలో అరుదైన గౌరవం..
- January 17, 2026
అమెరికా: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్కు అమెరికాలోని కాన్సాస్లో అరుదైన గౌరవం దక్కింది. కాన్సాస్ రాష్ట్ర సెనేట్ సభ్యులను ఆశీర్వదించి ప్రసంగించారు కేఏ పాల్.
ప్రపంచంలో జరుగుతున్న 58 యుద్ధాలను ఆపాలంటూ అమెరికా నాయకులకు కేఏ పాల్ పిలుపునిచ్చారు. వెనెజువెలా, యుక్రెయిన్, గాజా, ఇజ్రాయెల్, ఇరాన్లో శాంతి కోసం ప్రార్థనలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రపంచంలో అత్యధిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దేశంగా అమెరికాను ప్రశంసించారు. చైనా, రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్ ముప్పును ఎదుర్కొనేందుకు భారత్-అమెరికా కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.
అఫ్ఘానిస్థాన్, ఇరాన్ యుద్ధాలు అమెరికాకు నష్టం కలిగించాయని డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల నేతలు అంగీకరించారు. అంతకుముందు రిపబ్లికన్, డెమోక్రట్ నేతలు నిలబడి చప్పట్లతో కేఏ పాల్కు స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!
- ప్రైవేట్ ప్రయాణ ఏర్పాట్ల పై ఎంబసీ కీలక సూచనలు..!!
- నువైసీబ్ బార్డర్ వద్ద సెక్యూరిటీ రేడినెస్ పై సమీక్ష..!!
- యూఏఈ కాన్సులేట్ పై దాడిని ఖండించిన ఒమన్..!!
- ఉరుములతో కూడిన వర్షాలు..హెచ్చరించిన సివిల్ డిఫెన్స్..!!
- ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
- సౌదీ వైమానిక రక్షణ దళాల పై క్యాబినెట్ ప్రశంసలు..!!
- డే 12: ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్ ను అడ్డుకున్న UAE ఎయిర్ డిఫెన్స్..!!
- బ్రేకింగ్: సంక్షోభంలోనూ స్థిరంగా బంగారం..ఇన్వెస్టర్లను ఊరిస్తున్న మార్కెట్!









