వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- January 17, 2026
యూఏఈ: దుబాయ్ పోలీసులు తల్లిదండ్రులు మరియు టీనేజర్లను గట్టిగా హెచ్చరించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రాణాంతక ఛాలెంజ్ లు వైరల్ అవుతున్నాయిని, ఇవి ప్రాణాలకు తీవ్రమైన ముప్పు కలిగిస్తాయని హెచ్చరించారు. స్కల్ బ్రేకింగ్, ఛోకింగ్, బ్రీత్ హోల్డింగ్, ఇతర తీవ్రమైన గాయాలు లేదా మరణానికి దారితీసే ఛాలెంజ్లు ఈ ట్రెండ్లలో ఉన్నాయని అధికారులు ఒక చిన్న వీడియో క్లిప్లో తెలిపారు.
ఇతర దేశాలలో ఇలాంటి ఛాలెంజ్ ల కారణంగా అనేక మందికి తీవ్రమైన గాయాలు కావడంతోపాటు కొందరు తమ విలువైన ప్రాణాలను కోల్పోయారని దుబాయ్ పోలీసులు వెల్లడించారు. ఏదైనా ప్రమాదకరమైన లేదా అనుచితమైన ప్రవర్తనను గుర్తించిన వెంటనే 901కు కాల్ చేయడం ద్వారా లేదా దుబాయ్ పోలీస్ స్మార్ట్ యాప్లో అందుబాటులో ఉన్న ‘పోలీస్ ఐ’ సేవ ద్వారా తెలియజేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
అలాగే, పేరెంట్స్ వారి పిల్లలకు ఈ ఛాలెంజ్ కారణంగా తలెత్తే దుష్ఫ్రభావాలను వివరించాలని కోరారు. ముఖ్యంగా తమ పిల్లలు ఆన్లైన్ ను వినియోగించడం పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని దుబాయ్ పోలీసులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- అండమాన్ సెల్యులార్ జైలులో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్..
- యూజర్లకు UPI ఛార్జీలు ఉండవు.. కేంద్రం మరోసారి క్లారిటీ
- డేటింగ్ యాప్లో పురుషులకు అందంతో వల...రూ.6 కోట్లు వసూళ్లు
- మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం..మూడు దేశాల జెండా రంగుల్లో మెరిసిన సౌదీ ల్యాండ్మార్క్స్
- BRICS వాణిజ్య మంత్రుల సమావేశంలో యూఏఈ..
- హార్ముజ్ జలసంధిలో యూఏఈ ట్యాంకర్పై ఇరాన్ దాడిని జీసీసీ తీవ్రంగా ఖండించింది
- హార్ముజ్ జలసంధిలో యూఏఈ చమురు ట్యాంకర్పై క్షిపణి దాడి..బహ్రెయిన్ తీవ్ర ఖండన
- హోర్ముజ్ జలసంధిలో అడ్నాక్ నౌకపై క్షిపణి దాడి..సిబ్బంది సురక్షితం
- దుబాయ్లో 290 కి.మీ. వేగంతో బైక్ పై స్టంట్లు.. రైడర్ షాక్..!!
- సౌదీలో 911 ఎమర్జెన్సీ నంబర్కు 2.7మిలియన్ కాల్స్..!!







