వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- January 17, 2026
యూఏఈ: దుబాయ్ పోలీసులు తల్లిదండ్రులు మరియు టీనేజర్లను గట్టిగా హెచ్చరించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రాణాంతక ఛాలెంజ్ లు వైరల్ అవుతున్నాయిని, ఇవి ప్రాణాలకు తీవ్రమైన ముప్పు కలిగిస్తాయని హెచ్చరించారు. స్కల్ బ్రేకింగ్, ఛోకింగ్, బ్రీత్ హోల్డింగ్, ఇతర తీవ్రమైన గాయాలు లేదా మరణానికి దారితీసే ఛాలెంజ్లు ఈ ట్రెండ్లలో ఉన్నాయని అధికారులు ఒక చిన్న వీడియో క్లిప్లో తెలిపారు.
ఇతర దేశాలలో ఇలాంటి ఛాలెంజ్ ల కారణంగా అనేక మందికి తీవ్రమైన గాయాలు కావడంతోపాటు కొందరు తమ విలువైన ప్రాణాలను కోల్పోయారని దుబాయ్ పోలీసులు వెల్లడించారు. ఏదైనా ప్రమాదకరమైన లేదా అనుచితమైన ప్రవర్తనను గుర్తించిన వెంటనే 901కు కాల్ చేయడం ద్వారా లేదా దుబాయ్ పోలీస్ స్మార్ట్ యాప్లో అందుబాటులో ఉన్న ‘పోలీస్ ఐ’ సేవ ద్వారా తెలియజేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
అలాగే, పేరెంట్స్ వారి పిల్లలకు ఈ ఛాలెంజ్ కారణంగా తలెత్తే దుష్ఫ్రభావాలను వివరించాలని కోరారు. ముఖ్యంగా తమ పిల్లలు ఆన్లైన్ ను వినియోగించడం పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని దుబాయ్ పోలీసులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









