ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- January 17, 2026
రియాద్: రెండు పవిత్ర మసీదుల సంరక్షకులు కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం రియాద్లోని కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ హాస్పిటల్ నుండి బయలుదేరారని రాయల్ కోర్ట్ ప్రకటించింది.
అంతకుముందు ఆయన ఆస్పత్రిలో అత్యవసరంగా చేరారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. దీనిపై రాయల్ కోర్ట్ స్పందించింది. కింగ్ సల్మాన్ క్షేమంగా ఉన్నారని, సాధారణ వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో చేరారని క్లారిటీ ఇచ్చారు.
కింగ్ సల్మాన్ అవసరమైన వైద్య పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాత జనవరి 16న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని పేర్కొన్నారు. ఈ మెడికల్ పరీక్షల్లో ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని రాయల్ కోర్ట్ తన ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..







