ఆగష్టు 7న తెలంగాణా కి రానున్న ప్రధాని మోడీ
- July 28, 2016
ప్రధాని నరేంద్రమోడీ తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. సీనియర్ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం ఆగస్టు 7న ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నాం ఒంటి గంటకు బేగంపేట విమానాశ్రయానికి వస్తారు.
అక్కడ ప్రధాని మోడీకి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆహ్వానం పలకనున్నారు. ఆ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో 1.45 నిమిషాలకు కరీంనగర్ జిల్లాలోని రామగుండంకు బయల్దేరతారు. అక్కడ నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నిర్మించనున్న 1600 మెగావాట్ల థర్మల్ ప్లాంట్కు శంకుస్థాపన చేస్తారు.
ఆ తర్వాత పక్కనే రామగుండం ఫర్టిలైజర్స్కు కూడా మోడీ శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు గజ్వేల్కు ప్రయాణమవుతారు. గజ్వేల్లో మిషన్ భగీరథ ప్రాజెక్టు పైలాన్ను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
ఆ తర్వాత ఆదిలాబాద్ వెళ్తారు. ఆదిలాబాద్లోని జైపూర్లో 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ ప్లాంట్ను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుని ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి వెళ్తారు. మోడీ రాక సందర్భంగా ఆయన పర్యటన ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు.
ఈ సమావేశాన్ని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







