బంగ్లాదేశ్‌ హోంమంత్రితో ప్రధాని మోదీ చర్చలు

- July 28, 2016 , by Maagulf
బంగ్లాదేశ్‌ హోంమంత్రితో ప్రధాని మోదీ చర్చలు

బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదాన్ని అంతమొందించడంలో తమ వంతు సాయమందిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బంగ్లాదేశ్‌ హోంమంత్రి అసదుజ్జమాన్‌ ఖాన్‌తో ప్రధాని మోదీ గురువారం ఫోన్‌లో మాట్లాడి అక్కడి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో జూలై 1న జరిగిన ఉగ్రవాద దాడిని ఆయన ఖండిస్తూ, మృతులకు సంతాపం వ్యక్తం చేశారు. ఫోన్‌ చేసి అక్కడి పరిస్థితులు అడగి తెలుసుకున్నందుకు ఖాన్‌ మోదీకి ధన్యవాదాలు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com