దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- January 19, 2026
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ రాష్ట్రాలకు పెట్టుబడులు ఆకర్షించేందుకు దావోస్ (స్విట్జర్లాండ్) పర్యటనకు బయల్దేరారు. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో పాల్గొని, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే అంశాలపై వివిధ దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపే అవకాశం ఉంది.
చంద్రబాబు నిన్న అర్ధరాత్రి దావోస్ పర్యటనకు బయల్దేరారు. తొలుత ఆయన జ్యూరిచ్ చేరుకుని, అక్కడ జరిగే తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొని తెలుగు ప్రజలకు ప్రసంగిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో దావోస్కు ప్రయాణిస్తారు. దావోస్లో ఆయన నాలుగు రోజుల పాటు ఉన్నారు. ఈ కాలంలో 36 కార్యక్రమాల్లో పాల్గొని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పెట్టుబడుల అవకాశాలపై దృష్టి పెట్టి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. మొదటి రోజు ఆయన యూఏఈ ఆర్థిక, పర్యాటక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో సహా వివిధ విభాగాల ప్రతినిధులతో సమావేశమవుతారు. అలాగే టాటాసన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్తో కూడా ముఖాముఖి సమావేశం జరపనున్నారు.
ఈ ఉదయం మేడారం సమ్మక్క–సారలమ్మ దర్శనాన్ని పూర్తి చేసిన అనంతరం, రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి దావోస్కు బయల్దేరారు. ఈ పర్యటన ఐదు రోజుల పాటు కొనసాగనుంది. రేవంత్ రెడ్డి అంతర్జాతీయ స్థాయి సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను వివరిస్తారు. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ రంగాలపై దృష్టి సారించనున్నారు. తెలంగాణలో మౌలిక వసతులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, వ్యాపార అనుకూల వాతావరణాన్ని గ్లోబల్ ఇన్వెస్టర్లకు వివరించేందుకు ఈ పర్యటన ఉపయోగపడతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ పర్యటనలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహా పలు ఉన్నతాధికారులు కూడా పాల్గొంటున్నారు. మేడారం అమ్మవార్ల ఆశీస్సులతో ప్రారంభమైన ఈ విదేశీ పర్యటన తెలంగాణకు కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను తెచ్చేలా ఉంటుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









