ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!

- January 19, 2026 , by Maagulf
ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!

యూఏఈ: ఎతిహాద్ అరీనాలో జరిగిన టౌన్ హాల్‌లో బుర్జీల్ చైర్మన్, సీఈఓ డాక్టర్ షంషీర్ వాయాలిల్ 15 మిలియన్ల దిర్హామ్‌లతో రికగ్నిషన్ ఫండ్ ను ప్రకటించారు. ఇది వేలాది మంది ఆరోగ్య సంరక్షణ కార్మికులకు గుర్తింపు తీసుకురానుంది. ఈ సమావేశంలో 8,500 మందికి పైగా ఫ్రంట్‌లైన్ సిబ్బంది, వైద్యులు, నర్సులు, అనుబంధ ఆరోగ్య నిపుణులు మరియు సహాయక బృందాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశం యూఏఈలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద సమావేశాల్లో ఒకటిగా భావిస్తున్నారు.

ఈ సందర్భంగా కొత్తగా ప్రారంభించిన బుర్జీల్‌ ప్రౌడ్ మెంబర్షిప్ ను నిర్ధారిస్తూ SMS, నోటిఫికేషన్‌లు రావడం ప్రారంభమైంది. మొదటి దశలో దాదాపు 10 వేల మంది ఫ్రంట్‌లైన్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com