'తానా' అధ్యక్షులు శ్రీ సతీష్ వేమన గారికి అభినందన సభ
- July 20, 2015

దుబాయ్ లోని తెలుగు ప్రముఖులు శ్రీ ఎల్.అజిత్ కుమార్ గారు మరియు రసమయి తెలుగు అసోసియెషన్, దుబాయ్ వారి సహకారంతో, TANA అధ్యక్షులు శ్రీ సతీష్ వేమన గారికి అభినందన సభ ఏర్పాటుచేశారు. ఇక్కడి ప్రముఖ వ్యాపారవేత్తలు, సాంకేతిక మరియు ఐ. టి. నిపుణులు ఈ సభలో పాల్గొని సాంస్కృతిక అవగాహన పెంపొందించేందుకు,ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు NRI లకు సహాయపడేందుకు అవసరమైన చర్యలను గూర్చి వారి విలువైన అభిప్రాయాలను వెల్లడించారు. భవిష్యత్తులో తెలుగు సంస్కృతి వైభవాన్ని వ్యాప్తిచేసేందుకు రెండు సంఘాలు కలసి పనిచేయాలనే రసమయి జనరల్ సెక్రటరీ శ్రీమతి కృష్ణవేణి పంతాల గారి ఆలోచనను అందరు హర్షించారు. ఈవిధమైన దిగ్గజాల కలయిక, అంతర్జాతీయంగా మంచి విలువైన కార్యక్రమాలను చేపట్టగలవని, తెలుగువారి స్థాయిని పెంచగలవని రసమయి అధ్యక్షులు శ్రీ రాజు పొట్రు గారు వాకృచ్చారు.
--సి.శ్రీ(దుబాయ్)

తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









