'తానా' అధ్యక్షులు శ్రీ సతీష్ వేమన గారికి అభినందన సభ
- July 20, 2015

దుబాయ్ లోని తెలుగు ప్రముఖులు శ్రీ ఎల్.అజిత్ కుమార్ గారు మరియు రసమయి తెలుగు అసోసియెషన్, దుబాయ్ వారి సహకారంతో, TANA అధ్యక్షులు శ్రీ సతీష్ వేమన గారికి అభినందన సభ ఏర్పాటుచేశారు. ఇక్కడి ప్రముఖ వ్యాపారవేత్తలు, సాంకేతిక మరియు ఐ. టి. నిపుణులు ఈ సభలో పాల్గొని సాంస్కృతిక అవగాహన పెంపొందించేందుకు,ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు NRI లకు సహాయపడేందుకు అవసరమైన చర్యలను గూర్చి వారి విలువైన అభిప్రాయాలను వెల్లడించారు. భవిష్యత్తులో తెలుగు సంస్కృతి వైభవాన్ని వ్యాప్తిచేసేందుకు రెండు సంఘాలు కలసి పనిచేయాలనే రసమయి జనరల్ సెక్రటరీ శ్రీమతి కృష్ణవేణి పంతాల గారి ఆలోచనను అందరు హర్షించారు. ఈవిధమైన దిగ్గజాల కలయిక, అంతర్జాతీయంగా మంచి విలువైన కార్యక్రమాలను చేపట్టగలవని, తెలుగువారి స్థాయిని పెంచగలవని రసమయి అధ్యక్షులు శ్రీ రాజు పొట్రు గారు వాకృచ్చారు.
--సి.శ్రీ(దుబాయ్)

తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







